ETV Bharat / business

ప్రభుత్వ ఖాతాలపై బ్యాంకులకు ఆర్​బీఐ కీలక ఆదేశాలు

author img

By

Published : Mar 29, 2021, 3:32 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అకౌంట్స్ వార్షిక​ ముగింపునకు అన్నీ బ్యాంకులు స్పెషల్​ క్లియరింగ్​ ఆపరేషన్స్​ను చేపట్టాలని ఆర్​బీఐ ఆదేశించింది. ఇందుకు తగినంత క్లోజింగ్​ బ్యాలెన్స్​ను ఖాతాల్లో ఉంచాలని స్పష్టం చేసింది. మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది.

Banks to conduct special clearing operations for closure of govt accounts on Mar 31: RBI
'ప్రభుత్వ ఖాతాలను మార్చి 31లోపు క్లియర్​ చేయండి'

మరో రెండు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకుల్లో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖాతాల వార్షిక​ ముగింపునకు స్పెషల్​ క్లియరింగ్​ ఆపరేషన్స్​ను చేపట్టాలని భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ (ఆర్​బీఐ) ఆదేశించింది. అన్నీ బ్యాంకులు దీన్ని విధిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మార్చి 31లోపు పూర్తి కావాలని నోటిఫికేషన్​లో పేర్కొంది. క్లియరింగ్​కు తగినంత బ్యాలెన్స్​ను ఖాతాల్లో కొనసాగించాలని ఆదేశించింది.

ప్రతీ బుధవారం లాగే క్లియరింగ్​ సమయాలను మార్చి 31న కూడా అనుసరించాలని పేర్కొంది. ఆర్​బీఐ అనుబంధ బ్యాంకులు, అర్బన్​, స్టేట్​ సహకార బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్​ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు నేషనల్​ పేమెంట్స్​ కార్పోరేషన్​ ఆఫ్​ ఇండియాలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వాలు విడుదల చేసిన చెక్కులను ఈ నెల 31 లోపు క్లియర్​ చేయాలని కోరింది.

ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం!

మరో రెండు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకుల్లో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖాతాల వార్షిక​ ముగింపునకు స్పెషల్​ క్లియరింగ్​ ఆపరేషన్స్​ను చేపట్టాలని భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ (ఆర్​బీఐ) ఆదేశించింది. అన్నీ బ్యాంకులు దీన్ని విధిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మార్చి 31లోపు పూర్తి కావాలని నోటిఫికేషన్​లో పేర్కొంది. క్లియరింగ్​కు తగినంత బ్యాలెన్స్​ను ఖాతాల్లో కొనసాగించాలని ఆదేశించింది.

ప్రతీ బుధవారం లాగే క్లియరింగ్​ సమయాలను మార్చి 31న కూడా అనుసరించాలని పేర్కొంది. ఆర్​బీఐ అనుబంధ బ్యాంకులు, అర్బన్​, స్టేట్​ సహకార బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్​ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు నేషనల్​ పేమెంట్స్​ కార్పోరేషన్​ ఆఫ్​ ఇండియాలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వాలు విడుదల చేసిన చెక్కులను ఈ నెల 31 లోపు క్లియర్​ చేయాలని కోరింది.

ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.