ETV Bharat / business

విచారణకు హాజరైన యాపిల్​ సీఈఓ

author img

By

Published : May 22, 2021, 11:49 AM IST

యాపిల్​ సీఈఓ టిక్​కుక్​ శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. యాప్​లపై యాపిల్​ సంస్థ పొందుతున్న కమీషన్, ఇతర ఇన్​ట్రాన్సాక్షన్స్​కు సంస్థ అనుమతించక పోవడంపై కోర్టు టిక్​కుక్​ను ప్రశ్నించింది. కోర్టు విచారణలో భాగంగా పలుసార్లు టిమ్​ ఇబ్బందికి గురయ్యారు.

court questions tim cook, టిమ్​కుక్​ కోర్టు విచారణ
యాపిల్​ సీఈఓ టిమ్​కుక్​

యాపిల్​ సీఈఓను టిమ్​ కుక్​ను క్యాలిఫోర్నియాలోని స్థానిక జిల్లా కోర్టు శుక్రవారం విచారించింది. యాపిల్​.. గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ గేమింగ్​ సంస్థ 'ఎపిక్​ గేమ్స్​' దాఖలు చేసిన వాజ్యంపై విచారణలో భాగంగా టిక్​ కుక్​ను ప్రశ్నించింది.

యాపిల్​ సంస్థ ఇన్​యాప్​ ట్రాన్సాక్షన్స్​కు 15 నుంచి 30 శాతం కమీషన్​ పొందడమే కాక పేమెంట్లకు సంబంధించి యాప్​లు అందించే ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు అందుబాటులో లేకుండా బ్లాక్​ చేస్తోందని ఎపిక్​ గేమ్స్​ తన పిటిషన్​లో పేర్కొంది. కమీషన్​ లేకుండానే సబ్​స్క్రిబ్షన్​లకు చెల్లింపులు చేసేందుకు యాప్​లు అందించే వెబ్​పేజ్​ లింక్​లను కూడా రద్దు చేస్తోందని ఎపిక్​ గేమ్స్​ పేర్కొంది.

ఎపిక్​ గేమ్స్​ వ్యాజ్యంపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్​ గొనలేజ్​ రోజర్స్​.. ఐఫోన్​, ఐప్యాడ్​, ఐపాడ్​లలో తక్కువ కమీషన్​తో సేవలు అందించే ఇతర సంస్థలకు ఇన్​ట్రాన్సాక్షన్స్​ ఆప్షన్​ ఎందుకు కల్పించరని ప్రశ్నించారు. యాపిల్​ వైఖరిపై 39 శాతం యాప్​ డెవలపింగ్​ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయన్న ఓ సర్వే గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రస్తుత కమీషన్​ వ్యవస్థలో గేమింగ్​ యాప్​లకు ఎక్కవ కమీషన్​ పొందుతూ ఇతర యాప్​ల నుంచి తక్కువ కమీషన్ వసూల చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంస్థ పలు యాప్​లకు సబ్సిడీలు అందిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇబ్బందికి గురైన టిమ్​..

నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో.. ఎపిక్​ గేమ్స్​ తరఫు న్యాయవాది గేరీ బోర్న్​స్టేయిన్​ అడిగిన పలు ప్రశ్నలకు టిక్​కుక్ ఇబ్బందికి గురయ్యారు. యాప్​ స్టోర్​ ద్వారా సంస్థ పొందుతున్న లాభాలు, వినియోగదారుల ప్రైవసీపై చైనాతో రాజీపడ్డారన్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు.

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకునే యాపిల్​ స్టోర్​లో ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని టిమ్​ పునరుద్ఘాటించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సబ్సిడీ వ్యవస్థ ఉన్న మాట వాస్తవమేనని, గేమింగ్​ యాప్​లు ఎక్కువ లాభం పొందుతాయి కనుక వాటి నుంచి ఎక్కువ కమీషన్​ వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.

ఆ వ్యాజ్యంతో తగ్గిన యాపిల్​

గతేడాది ఆగస్టులో ఎపిక్​ గేమ్స్ ఈ​ వ్యాజ్యం దాఖలు చేసింది. దీంతో యాపిల్​.. ఇన్​యాప్​ కమీషన్లను 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

ఇదీ చదవండి : ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌.. ఇక సెలవు

యాపిల్​ సీఈఓను టిమ్​ కుక్​ను క్యాలిఫోర్నియాలోని స్థానిక జిల్లా కోర్టు శుక్రవారం విచారించింది. యాపిల్​.. గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ గేమింగ్​ సంస్థ 'ఎపిక్​ గేమ్స్​' దాఖలు చేసిన వాజ్యంపై విచారణలో భాగంగా టిక్​ కుక్​ను ప్రశ్నించింది.

యాపిల్​ సంస్థ ఇన్​యాప్​ ట్రాన్సాక్షన్స్​కు 15 నుంచి 30 శాతం కమీషన్​ పొందడమే కాక పేమెంట్లకు సంబంధించి యాప్​లు అందించే ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు అందుబాటులో లేకుండా బ్లాక్​ చేస్తోందని ఎపిక్​ గేమ్స్​ తన పిటిషన్​లో పేర్కొంది. కమీషన్​ లేకుండానే సబ్​స్క్రిబ్షన్​లకు చెల్లింపులు చేసేందుకు యాప్​లు అందించే వెబ్​పేజ్​ లింక్​లను కూడా రద్దు చేస్తోందని ఎపిక్​ గేమ్స్​ పేర్కొంది.

ఎపిక్​ గేమ్స్​ వ్యాజ్యంపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్​ గొనలేజ్​ రోజర్స్​.. ఐఫోన్​, ఐప్యాడ్​, ఐపాడ్​లలో తక్కువ కమీషన్​తో సేవలు అందించే ఇతర సంస్థలకు ఇన్​ట్రాన్సాక్షన్స్​ ఆప్షన్​ ఎందుకు కల్పించరని ప్రశ్నించారు. యాపిల్​ వైఖరిపై 39 శాతం యాప్​ డెవలపింగ్​ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయన్న ఓ సర్వే గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రస్తుత కమీషన్​ వ్యవస్థలో గేమింగ్​ యాప్​లకు ఎక్కవ కమీషన్​ పొందుతూ ఇతర యాప్​ల నుంచి తక్కువ కమీషన్ వసూల చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంస్థ పలు యాప్​లకు సబ్సిడీలు అందిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇబ్బందికి గురైన టిమ్​..

నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో.. ఎపిక్​ గేమ్స్​ తరఫు న్యాయవాది గేరీ బోర్న్​స్టేయిన్​ అడిగిన పలు ప్రశ్నలకు టిక్​కుక్ ఇబ్బందికి గురయ్యారు. యాప్​ స్టోర్​ ద్వారా సంస్థ పొందుతున్న లాభాలు, వినియోగదారుల ప్రైవసీపై చైనాతో రాజీపడ్డారన్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు.

వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకునే యాపిల్​ స్టోర్​లో ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని టిమ్​ పునరుద్ఘాటించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సబ్సిడీ వ్యవస్థ ఉన్న మాట వాస్తవమేనని, గేమింగ్​ యాప్​లు ఎక్కువ లాభం పొందుతాయి కనుక వాటి నుంచి ఎక్కువ కమీషన్​ వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.

ఆ వ్యాజ్యంతో తగ్గిన యాపిల్​

గతేడాది ఆగస్టులో ఎపిక్​ గేమ్స్ ఈ​ వ్యాజ్యం దాఖలు చేసింది. దీంతో యాపిల్​.. ఇన్​యాప్​ కమీషన్లను 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

ఇదీ చదవండి : ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌.. ఇక సెలవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.