ETV Bharat / business

3.97 కోట్ల ఐటీఆర్​లు దాఖలు

author img

By

Published : Dec 25, 2020, 5:40 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్​ 24నాటికి మొత్తం 3.97 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా ఉంటే డిసెంబర్ 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.

3.97 cr ITRs filed for 2019-20 fiscal till Dec 24
ఐటీఆర్​కు 3.97 మంది దరఖాస్తు

డిసెంబర్​ 24 వరకు మొత్తం 3.97 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈనెల 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఐటీఆర్​లకు సంబంధించిన వివరాలను ఈమేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది.

మొత్తం 3.97 కోట్ల మందిలో ఐటీఆర్-1కు 2.27 కోట్ల మంది, ఐటీఆర్​-4కు 85.20 లక్షల మంది, ఐటీఆర్-3కి 46.78 మంది, ఐటీఆర్-2కి 28.74మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ దాఖలు చేసేందుకు ఈనెల 31 వరకు గడవుంది. ఆడిటింగ్​ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఐటీఆర్​ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు పొడిగించింది కేంద్రం.

2018-19 ఆర్థిక సంవత్సారానికి ఆలస్య రుసుం లేకుండా మొత్తం 5.65 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.

గతేడాది ఆగస్టు 31వరకు 3.92 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేయగా, ఈ ఏడాది డిసెంబర్​ 24 వరకు 3.97 కోట్ల మంది ఐటీఆర్​ ఫైల్ చేసినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ప్రత్యేక మండలితోనే పద్దులో పారదర్శకత'

డిసెంబర్​ 24 వరకు మొత్తం 3.97 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈనెల 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఐటీఆర్​లకు సంబంధించిన వివరాలను ఈమేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది.

మొత్తం 3.97 కోట్ల మందిలో ఐటీఆర్-1కు 2.27 కోట్ల మంది, ఐటీఆర్​-4కు 85.20 లక్షల మంది, ఐటీఆర్-3కి 46.78 మంది, ఐటీఆర్-2కి 28.74మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్​ దాఖలు చేసేందుకు ఈనెల 31 వరకు గడవుంది. ఆడిటింగ్​ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఐటీఆర్​ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు పొడిగించింది కేంద్రం.

2018-19 ఆర్థిక సంవత్సారానికి ఆలస్య రుసుం లేకుండా మొత్తం 5.65 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.

గతేడాది ఆగస్టు 31వరకు 3.92 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేయగా, ఈ ఏడాది డిసెంబర్​ 24 వరకు 3.97 కోట్ల మంది ఐటీఆర్​ ఫైల్ చేసినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ప్రత్యేక మండలితోనే పద్దులో పారదర్శకత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.