ETV Bharat / business

'రెండు నెలల్లో రూ.3,360కోట్ల పీఎఫ్​ ఉపసంహరణ'

author img

By

Published : May 17, 2020, 4:15 PM IST

లాక్​డౌన్​లో కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు 12లక్షల మంది రూ.3,360 కోట్ల విలువైన పీఎఫ్​ను ఉపసంహరించుకున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. పీఎంజీకేవై కింద విడుదల చేసిన రూ.3,950కోట్లలతో భవన నిర్మాణ కార్మికులూ లబ్ధి పొందినట్లు మంత్రి వెల్లడించారు.

12 lakh EPFO members withdraw Rs 3,360 cr retirement savings during lockdown: FM
ఈపీఎఫ్​ఓ నుంచి రూ.3,360కోట్లు ఉపసంహరణ: ఆర్థిక మంత్రి

లాక్​డౌన్​లో దాదాపు 12 లక్షలమంది ఈపీఎఫ్​ఓ(ఎంప్లాయిమెట్​ ప్రొవిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్) ఖాతాదారులు తమ రిటైర్మెంట్​ పొదువుల్లో నుంచి రూ.3,360 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆదివారం వెల్లడించారు.

కరోనా సంక్షోభంలో కష్టాలను ఎదుర్కొవడానికి కార్మికులు తమ పీఎఫ్​ ఖాతాల నుంచి నాన్​ రీఫండెబుల్​ అడ్వాన్స్​ను ఉపసంహరించుకోవచ్చని మార్చి 28న ఈపీఎఫ్ఓ అనుమతిచ్చింది. ఈ మేరకు గత రెండు నెలల్లో 12 లక్షలమంది పీఎఫ్​ను ఉపసంహరించుకున్నారని ఐదో దశ ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో ఆర్థిక మంత్రి వెల్లడించారు.

నిర్మాణ కార్మికులకు లబ్ధి

ప్రధాన్ మంత్రి గరిబ్​ కళ్యాణ్​ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీ కింద మొత్తం 12 లక్షల మందికి ఈపీఎఫ్​ఓ లబ్ధి చేకూర్చిందని ఆర్థిక మంత్రి తెలిపారు. లాక్​డౌన్​ కాలంలో పీఎంజీకేవై కింద విడుదల చేసిన రూ.3,950కోట్లలతో 2.2 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు కూడా లబ్ధి పొందినట్లు వెల్లడించారు.

రాష్ట్రాలే ఆదుకోవాలి!

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్​ గంగ్వార్​. రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న రూ.52,000 కోట్ల విలువైన నిర్మాణ సెస్​తో 3.5కోట్లకు పైగా భవన నిర్మాణ కార్శికులకు ఆర్థిక సాయం చేయాలన్నారు గంగ్వార్​.

ఇదీ చూడండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్​లో ఏ రంగానికి ఎంత?

లాక్​డౌన్​లో దాదాపు 12 లక్షలమంది ఈపీఎఫ్​ఓ(ఎంప్లాయిమెట్​ ప్రొవిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్) ఖాతాదారులు తమ రిటైర్మెంట్​ పొదువుల్లో నుంచి రూ.3,360 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆదివారం వెల్లడించారు.

కరోనా సంక్షోభంలో కష్టాలను ఎదుర్కొవడానికి కార్మికులు తమ పీఎఫ్​ ఖాతాల నుంచి నాన్​ రీఫండెబుల్​ అడ్వాన్స్​ను ఉపసంహరించుకోవచ్చని మార్చి 28న ఈపీఎఫ్ఓ అనుమతిచ్చింది. ఈ మేరకు గత రెండు నెలల్లో 12 లక్షలమంది పీఎఫ్​ను ఉపసంహరించుకున్నారని ఐదో దశ ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో ఆర్థిక మంత్రి వెల్లడించారు.

నిర్మాణ కార్మికులకు లబ్ధి

ప్రధాన్ మంత్రి గరిబ్​ కళ్యాణ్​ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీ కింద మొత్తం 12 లక్షల మందికి ఈపీఎఫ్​ఓ లబ్ధి చేకూర్చిందని ఆర్థిక మంత్రి తెలిపారు. లాక్​డౌన్​ కాలంలో పీఎంజీకేవై కింద విడుదల చేసిన రూ.3,950కోట్లలతో 2.2 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు కూడా లబ్ధి పొందినట్లు వెల్లడించారు.

రాష్ట్రాలే ఆదుకోవాలి!

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్​ గంగ్వార్​. రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న రూ.52,000 కోట్ల విలువైన నిర్మాణ సెస్​తో 3.5కోట్లకు పైగా భవన నిర్మాణ కార్శికులకు ఆర్థిక సాయం చేయాలన్నారు గంగ్వార్​.

ఇదీ చూడండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్​లో ఏ రంగానికి ఎంత?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.