ETV Bharat / budget-2019

'బడ్జెట్​ లక్ష్యాల సాధనే అసలు సవాలు'

author img

By

Published : Jul 5, 2019, 5:12 PM IST

Updated : Jul 5, 2019, 5:18 PM IST

ప్రస్తుతం వృద్ధి నెమ్మదించిన వేళ బడ్జెట్​ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ రేటింగ్స్​ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది.  ఆర్థిక లోటు తగ్గింపు, అధిక వృద్ధి రేటు సాధన, రైతులు, నిమ్న వర్గాలకు ఆర్థిక సహకారం వంటి అంశాలను క్లిష్టమైనవిగా అభివర్ణించింది.

'బడ్జెట్​ లక్ష్యాల సాధన ప్రభుత్వానికి సవాలే'

లోక్​సభలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం​ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్​ విశ్లేషించింది. వృద్ధి రేటు మందగించిన సమయంలో ఆర్థిక లోటు తగ్గింపు, అధిక వృద్ధి రేటు సాధన, రైతులు, నిమ్న వర్గాలకు ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని తెలిపింది.

ఆదాయ సహకారం అందించేందుకు బడ్జెట్​లో ప్రకటించిన పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదిస్తుందని హెచ్చరించింది మూడీస్. పన్ను వసూలు తగ్గిపోతే ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవటం అసాధ్యమని పేర్కొంది.

"దీన్ని సాధించాలంటే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, కేంద్ర బ్యాంకుపై ఆధారపడాల్సి వస్తుంది. ధనికులపై అదనపు పన్ను భారాన్ని మోపాల్సి ఉంటుంది. ఇప్పటికే పెట్రోల్​, డీజిల్​, విలువైన లోహాలు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను పెంచింది."

-మూడీస్​

రుణ భారం

రైతులకు మద్దతు కల్పించేలా బ్యాంకుల బలోపేతానికి రూ.70 వేల కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈ చర్యతో ఆర్థిక వ్యవస్థకు రుణ భారం పెరుగుతుందని హెచ్చరించింది మూడీస్.

25 శాతం పన్ను సహేతుకం: సీఐఐ

బడ్జెట్​లో పరిశ్రమల పన్ను విధానంలో మార్పు నిర్ణయాన్ని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభినందించింది. రూ.400 కోట్ల లోపు టర్నోవర్​ ఉన్న కంపెనీలను అన్నింటినీ 25 శాతం పన్ను విభాగంలోకి చేర్చటం మంచి చర్య అని సీఐఐ ప్రశంసించింది.

ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి: అసోచామ్

మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడాన్ని వాణిజ్య సంస్థ అసోచామ్​ స్వాగతించింది. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం అవుతుందని విశ్లేషించింది.

ఇదీ చూడండి: బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం

లోక్​సభలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం​ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్​ విశ్లేషించింది. వృద్ధి రేటు మందగించిన సమయంలో ఆర్థిక లోటు తగ్గింపు, అధిక వృద్ధి రేటు సాధన, రైతులు, నిమ్న వర్గాలకు ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని తెలిపింది.

ఆదాయ సహకారం అందించేందుకు బడ్జెట్​లో ప్రకటించిన పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదిస్తుందని హెచ్చరించింది మూడీస్. పన్ను వసూలు తగ్గిపోతే ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవటం అసాధ్యమని పేర్కొంది.

"దీన్ని సాధించాలంటే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, కేంద్ర బ్యాంకుపై ఆధారపడాల్సి వస్తుంది. ధనికులపై అదనపు పన్ను భారాన్ని మోపాల్సి ఉంటుంది. ఇప్పటికే పెట్రోల్​, డీజిల్​, విలువైన లోహాలు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను పెంచింది."

-మూడీస్​

రుణ భారం

రైతులకు మద్దతు కల్పించేలా బ్యాంకుల బలోపేతానికి రూ.70 వేల కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈ చర్యతో ఆర్థిక వ్యవస్థకు రుణ భారం పెరుగుతుందని హెచ్చరించింది మూడీస్.

25 శాతం పన్ను సహేతుకం: సీఐఐ

బడ్జెట్​లో పరిశ్రమల పన్ను విధానంలో మార్పు నిర్ణయాన్ని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభినందించింది. రూ.400 కోట్ల లోపు టర్నోవర్​ ఉన్న కంపెనీలను అన్నింటినీ 25 శాతం పన్ను విభాగంలోకి చేర్చటం మంచి చర్య అని సీఐఐ ప్రశంసించింది.

ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి: అసోచామ్

మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడాన్ని వాణిజ్య సంస్థ అసోచామ్​ స్వాగతించింది. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం అవుతుందని విశ్లేషించింది.

ఇదీ చూడండి: బడ్జెట్: సంస్కరణలతో అభివృద్ధి పయనం

Intro:Body:

i


Conclusion:
Last Updated : Jul 5, 2019, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.