ETV Bharat / briefs

ఖమ్మంలో కల ఫలించిన వేళ... తెరాస ఆనంద హేల...

నిరీక్షణ ఫలించింది... కల నెరవేరింది... ఎట్టకేలకు ఖమ్మం జిల్లాలో గులాబీ దళం జెండా ఎగురవేసింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఇటీవల తెరాసలో చేరిన నామ నాగేశ్వరరావు కాంగ్రెస్​ ఫైర్​ బ్రాండ్​ రేణుకా చౌదరిపై ఘన విజయం సాధించి... గులాబీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చారు. 163 రోజుల వ్యవధిలోనే ఓటమిని... గెలుపును చవి చూసిన నామ ఈ విజయంతో తెరాసలో చెరగని ముద్ర వేశారు.

author img

By

Published : May 24, 2019, 11:24 PM IST

ఖమ్మంలో తెరాస గెలుపు

ఖమ్మం లోక్​సభ ఖిల్లాపై ఎట్టకేలకు గులాబీ జెండా ఎగిరింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థానంలో పాగా వేసేందుకు సర్వశక్తులొడ్డిన తెరాస ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పొగొట్టుకున్న చోటే సాధించాలనుకున్న గులాబీ వ్యూహం ఫలించింది. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన నామ నాగేశ్వరరావు సరికొత్త చరిత్ర లిఖించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానం గెలవడం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాం నింపింది.

ఖమ్మం ఖిల్లాలో పాగా వేసిన తెరాస

అలుపెరుగని పోరు

ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తెరాస... ఖమ్మం జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు 2001 నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. లోక్​సభ స్థానంలో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి నుంచి జెండా ఎగురవేసే స్థాయికి ఎదిగింది. నామ నాగేశ్వరరావు 2009లో తెదేపా తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ముందు గులాబీ గూటికి చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ఫైర్​ బ్రాండ్​పై విజయం

2004 ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేసిన నామ తెదేపా తరఫున పోటీ చేసి రేణుకా చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ట్రస్టు ద్వారా సామాజిక సేవ చేశారు. అనంతరం 2009 హోరాహోరీ పోరులో రేణుకా చౌదరిపై విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2014లో వైకాపా అభ్యర్థి పొంగులేటి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2019లో అనూహ్య పరిణామాల మధ్య తెరాసలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచి గెలిచారు.

163 రోజుల వ్యవధిలోనే...

కేవలం 163 రోజుల వ్యవధిలోనే గెలుపోటములు చవి చూసిన నేతగా నామ నాగేశ్వరరావు నిలిచారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పువ్వాడ అజయ్​కుమార్​పై పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఖమ్మం లోక్​సభ అభ్యర్థిగా తెరాస తరఫున బరిలో దిగి విజయాన్ని అందుకున్నారు.

ఇదీ చూడండి : 'దళపతి వ్యూహం ఫలించింది ... గండం తప్పింది'

ఖమ్మం లోక్​సభ ఖిల్లాపై ఎట్టకేలకు గులాబీ జెండా ఎగిరింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థానంలో పాగా వేసేందుకు సర్వశక్తులొడ్డిన తెరాస ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పొగొట్టుకున్న చోటే సాధించాలనుకున్న గులాబీ వ్యూహం ఫలించింది. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన నామ నాగేశ్వరరావు సరికొత్త చరిత్ర లిఖించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానం గెలవడం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాం నింపింది.

ఖమ్మం ఖిల్లాలో పాగా వేసిన తెరాస

అలుపెరుగని పోరు

ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తెరాస... ఖమ్మం జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు 2001 నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. లోక్​సభ స్థానంలో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి నుంచి జెండా ఎగురవేసే స్థాయికి ఎదిగింది. నామ నాగేశ్వరరావు 2009లో తెదేపా తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ముందు గులాబీ గూటికి చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ఫైర్​ బ్రాండ్​పై విజయం

2004 ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేసిన నామ తెదేపా తరఫున పోటీ చేసి రేణుకా చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ట్రస్టు ద్వారా సామాజిక సేవ చేశారు. అనంతరం 2009 హోరాహోరీ పోరులో రేణుకా చౌదరిపై విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2014లో వైకాపా అభ్యర్థి పొంగులేటి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2019లో అనూహ్య పరిణామాల మధ్య తెరాసలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచి గెలిచారు.

163 రోజుల వ్యవధిలోనే...

కేవలం 163 రోజుల వ్యవధిలోనే గెలుపోటములు చవి చూసిన నేతగా నామ నాగేశ్వరరావు నిలిచారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పువ్వాడ అజయ్​కుమార్​పై పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఖమ్మం లోక్​సభ అభ్యర్థిగా తెరాస తరఫున బరిలో దిగి విజయాన్ని అందుకున్నారు.

ఇదీ చూడండి : 'దళపతి వ్యూహం ఫలించింది ... గండం తప్పింది'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.