ETV Bharat / briefs

ఆ కళాశాలకు విద్యార్థులు రారు.. కానీ పాసవుతారు..!

అది ఓ ఐటీఐ కళాశాల. అందులో 600 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. తరగతులకు పదుల సంఖ్యలో వస్తుంటారు. కానీ పరీక్షలు మాత్రం అందరూ రాస్తారు. ఇదెలా సాధ్యమంటే విద్యార్థులకు తామే హాజరువేస్తామంటూ బదులిచ్చారు ఓ అధ్యాపకుడు.

author img

By

Published : Mar 24, 2019, 7:56 AM IST

Updated : Mar 24, 2019, 9:20 AM IST

ఐటీఐ కళాశాల
ఐటీఐ కళాశాల
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాల... జాతీయ వృత్తి నైపుణ్యాల సంస్థ పరిధిలో పనిచేస్తోంది. ఏటా పాలీసెట్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందుతున్నారు. తరగతులకు విద్యార్థులు రాకపోయినా... పరీక్షలు రాస్తారు. వారికి అధ్యాపకులు సహకరించడం వల్ల పాసవుతున్నారు. ఇలా ఉత్తీర్ణులైన వారే ఐటీఐ పట్టాలతో బయటకు వస్తున్నారు. నాణ్యమైన చదువు లేక ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

అడ్మిషన్లు పొందిన నాటి నుంచి ధ్రువపత్రాలు పొందే వరకు విద్యార్థుల వద్ద కళాశాల యాజమాన్యం ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోంది. వారి గైర్హాజరు కళాశాలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. కాలేజీలో తరగతులు జరగకున్నా ఎవరూపట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. యాజమాన్యం ఆడిందే ఆట పాడింది పాట లాగా తయారయింది.

తుప్పుపడుతున్న ప్రయోగపరికరాలు..

600 మంది విద్యార్థులు ఉన్నా... కళాశాల బోసిపోతోంది. ప్రయోగ పరికరాలు తుప్పుపడుతున్నాయి. దశాబ్దం నుంచి ఇదే తంతు కొనసాగుతున్న పట్టించుకొనే నాథుడే లేడు. విద్యార్థుల భవిష్యత్తుప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:తెలంగాణ సీజే జస్టిస్​ రాధాకృష్ణన్ బదిలీ

ఐటీఐ కళాశాల
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాల... జాతీయ వృత్తి నైపుణ్యాల సంస్థ పరిధిలో పనిచేస్తోంది. ఏటా పాలీసెట్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందుతున్నారు. తరగతులకు విద్యార్థులు రాకపోయినా... పరీక్షలు రాస్తారు. వారికి అధ్యాపకులు సహకరించడం వల్ల పాసవుతున్నారు. ఇలా ఉత్తీర్ణులైన వారే ఐటీఐ పట్టాలతో బయటకు వస్తున్నారు. నాణ్యమైన చదువు లేక ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

అడ్మిషన్లు పొందిన నాటి నుంచి ధ్రువపత్రాలు పొందే వరకు విద్యార్థుల వద్ద కళాశాల యాజమాన్యం ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోంది. వారి గైర్హాజరు కళాశాలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. కాలేజీలో తరగతులు జరగకున్నా ఎవరూపట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. యాజమాన్యం ఆడిందే ఆట పాడింది పాట లాగా తయారయింది.

తుప్పుపడుతున్న ప్రయోగపరికరాలు..

600 మంది విద్యార్థులు ఉన్నా... కళాశాల బోసిపోతోంది. ప్రయోగ పరికరాలు తుప్పుపడుతున్నాయి. దశాబ్దం నుంచి ఇదే తంతు కొనసాగుతున్న పట్టించుకొనే నాథుడే లేడు. విద్యార్థుల భవిష్యత్తుప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:తెలంగాణ సీజే జస్టిస్​ రాధాకృష్ణన్ బదిలీ

Intro:TG_SRD_36_23_peruku_kalshala_taragatulu_jaragavu_g6
అదొక వృత్తి విద్యా, నైపుణ్యాలను నేర్పించే కళాశాల.. కళాశాలలో 600 మంది విద్యార్థులు అడ్మిస్సిన్లు పొందారు.. తరగతులకు మాత్రం పదుల సంఖ్యలో వస్తుంటారు.. పరీక్షలు మాత్రం అందరూ రాస్తారు... ఇదేంటని కళాశాల ప్రధాన అధపకుడిని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.... విద్యార్థులకు తామే హాజరు వేస్తామని చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఒక ప్రయివేటు ఐటిఐ కళాశాల ఉంది. జాతీయ వృత్తి నైపుణ్యాల సంస్థ పరిధిలో అది పనిచేస్తోంది. ఇక్కడ ఫిట్టర్, డీజల్ మేకనిన్, ఎలెక్ట్రిషన్ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వ పాలి సెట్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందుతారు. ఆడిమిషన్ పొందిన తరువాత విద్యార్థులు తరగతులకు రారు. అయినా వారు పరీక్షలు రాస్తారు. పరీక్షల్లో వారికి అధ్యాపకులు సహకరించడం తో పాసవుతున్నారు. ఇలా పాసైన వారే ఐటిఐ పట్టాలతో బయటకు వస్తున్నారు. అడ్మిషన్లు పొందిన నాటి నుంచి సర్టిఫికేట్ పొందే వరకు విద్యార్థుల వద్ద కళాశాల యాజమాన్యం ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేస్తోంది. విద్యార్థుల గైరాజరు వారికి ఆదాయం తెచ్చి పెడుతుంది. కళాశాలలో నిత్యం తరగతులు జరగకున్న ఎవరు పట్టించుకువడం లేదు. ఉన్నతాధికారులు అజమాయిషీ కొరవడింది. కళాశాల యాజమాన్యం ఆడిందే ఆట పాడింది పాట లాగా తయారయింది. నిత్యం విద్యార్థులు సక్రమంగా వస్తే సక్రమంగా తరగతులు జరుగుతాయి. 600 మంది విద్యార్థులతో కళ కళ లాడాల్సిన కళాశాల విద్యార్థులు లేక బోసిపోతుంది. డీజల్ ఇంజన్లకు తుప్పు పట్టాయి. ఎలెక్ట్రిషన్, ఫిట్టర్ తరగతి గదుల తాళాలు తెరవడం లేదు. తరగతులు లేవు, విద్యార్థులు లేరు ఇదేంటి అంటే విద్యార్థులు రారు, వారికి తామర హాజరు వేస్తాం అని కళాశాల ప్రధానాధ్యపకుడు బ్రహ్మం తెలిపారు. దశబ్దంగా ఈ కళాశాలలో ఇదే తంతు కొనసాగుతున్న పట్టించుకొనే నాథుడే లేడు. విద్యార్థుల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.


Body:TG_SRD_36_23_peruku_kalshala_taragatulu_jaragavu_g6


Conclusion:
Last Updated : Mar 24, 2019, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.