ETV Bharat / briefs

భారత్​ చేరుకున్న జైట్లీ

అమెరికాలో క్యాన్సర్​కు చికిత్స తీసుకున్న అరుణ్​జైట్లీ నేడు భారత్​కు​ చేరుకున్నారు.

author img

By

Published : Feb 9, 2019, 7:51 PM IST

భారత్​ చేరుకున్న జైట్లీ

కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ ఈ రోజు న్యూయార్క్​ నుంచి భారత్​కు చేరుకున్నారు. అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న 66 ఏళ్ల జైట్లీ, స్వదేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉందని ట్వీట్​ చేశారు.

అరుణ్​జైట్లీ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఆర్థికశాఖను పీయూష్​గోయల్​కు తాత్కాలికంగా అప్పగించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 మధ్యంతర బడ్జెట్​ను, రైల్వే బడ్జెట్​ను తాత్కాలిక అర్థికమంత్రి పీయూష్​గోయల్ ప్రవేశపెట్టారు.

అయితే మోదీప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జైట్లీ న్యూయార్క్ నుంచే ప్రతిఘటించారు. విపక్షాల విమర్శలకు తన ట్వీట్​లతో, ఫేస్​బుక్​ పోస్టులతో ధీటుగా బదులిచ్చారు జైట్లీ. ఈ విషయంపై మీడియాతో ముఖాముఖిలో సైతం జైట్లీ పాల్గొన్నారు.

అరుణ్​జైట్లీకి ఇంతకు మునుపు 2018లో మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆ సందర్భంలో సైతం సుమారు 100 రోజులపాటు జైట్లీ బాధ్యతలను పీయూష్​గోయల్ చేపట్టారు.

మధుమేహంతో బాధపడుతున్న జైట్లీకి 2014లో బేరియాట్రిక్​ సర్జరీ సైతం జరిగింది.

కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ ఈ రోజు న్యూయార్క్​ నుంచి భారత్​కు చేరుకున్నారు. అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న 66 ఏళ్ల జైట్లీ, స్వదేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉందని ట్వీట్​ చేశారు.

అరుణ్​జైట్లీ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఆర్థికశాఖను పీయూష్​గోయల్​కు తాత్కాలికంగా అప్పగించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 మధ్యంతర బడ్జెట్​ను, రైల్వే బడ్జెట్​ను తాత్కాలిక అర్థికమంత్రి పీయూష్​గోయల్ ప్రవేశపెట్టారు.

అయితే మోదీప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జైట్లీ న్యూయార్క్ నుంచే ప్రతిఘటించారు. విపక్షాల విమర్శలకు తన ట్వీట్​లతో, ఫేస్​బుక్​ పోస్టులతో ధీటుగా బదులిచ్చారు జైట్లీ. ఈ విషయంపై మీడియాతో ముఖాముఖిలో సైతం జైట్లీ పాల్గొన్నారు.

అరుణ్​జైట్లీకి ఇంతకు మునుపు 2018లో మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆ సందర్భంలో సైతం సుమారు 100 రోజులపాటు జైట్లీ బాధ్యతలను పీయూష్​గోయల్ చేపట్టారు.

మధుమేహంతో బాధపడుతున్న జైట్లీకి 2014లో బేరియాట్రిక్​ సర్జరీ సైతం జరిగింది.

Viral Advisory
Saturday 9th February 2019
Clients, please note the following addition to our output:
VIRAL (SOCCER): Manchester City manager Pep Guardiola is stunned when a journalist tells him that Benjamin Mendy is in Hong Kong, following a mischievous social media post by the French defender. Already moved.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.