జగన్ చిన్నాన్నవై.ఎస్.వివేకానందరెడ్డిని వైకాపా వాళ్లే హత్య చేయించారని డీజీపీ చెప్తుతున్నారంటూ ఆ పార్టీఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి అసత్యాలు చెబుతుంటే ఏపీ పోలీసులను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఆంధ్రాపోలీసులు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. తెదేపా హత్యా రాజకీయాలు చేస్తోందన్న విజయసాయిరెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.హత్య కేసు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ అయితే అమలుచేసింది ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి మరణంపై పూర్తి విచారణ చేపట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్తోకేంద్రానికి, రాష్ట్రానికి లేఖ రాశామని ఎంపీ తెలిపారు.
ఇవీ చూడండి:'వివేకాది సాధారణ మృతి కాదు'