ETV Bharat / briefs

'తెదేపా విలీన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమే'

తెదేపా విలీన ప్రక్రియను కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్​ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగినట్లు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

author img

By

Published : Jun 23, 2019, 5:30 PM IST

CENTRAL MINISTER KISHAN REDDY ON TDP MPS JOINING iN BJP

తెదేపా రాజ్యసభ పక్ష విలీన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ఉద్ఘాటించారు. కొందరు ఈ అంశాన్ని అనవసర వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని తెలిపారు. కొందరు తమ అవగాహనరాహిత్యంతో విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా రాజ్యసభ సభ్యుల లేఖ మేరకు వారిని భాజపా సభ్యులుగా గుర్తించినట్లు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

పదో షెడ్యూల్​ ప్రకారమే....

ఇవీ చూడండి: చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

తెదేపా రాజ్యసభ పక్ష విలీన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ఉద్ఘాటించారు. కొందరు ఈ అంశాన్ని అనవసర వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని తెలిపారు. కొందరు తమ అవగాహనరాహిత్యంతో విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా రాజ్యసభ సభ్యుల లేఖ మేరకు వారిని భాజపా సభ్యులుగా గుర్తించినట్లు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

పదో షెడ్యూల్​ ప్రకారమే....

ఇవీ చూడండి: చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

Intro:TG_KRN_101_23_GOURAVELLI PROJECT_BHU NIRVASITHULA_AVEDHANA_PKG_C11
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. 2009 సంవత్సరం లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు పనులును ప్రారంభించగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రీ డిజైన్ లో భాగంగా 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెంచింది. గుడాటిపల్లి గ్రామంతో పాటు పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి,మద్దలపల్లి,చింతలతండా,సోమజితండా, జాల్ భాయ్ తండాలు కూడా గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ముంపునకు గురవుతున్నాయి. తరుచుగా గుడాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొందరు భూ నిర్వాసితులు తమకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలంటూ గౌరవెళ్లి ప్రాజెక్ట్ పనులను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం రీ డిజైన్ లో భాగంగా ప్రాజెక్ట్ నిర్వహణ కోసం దాదాపు 4000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించుకుంది. ప్రాజెక్టు పనుల ప్రారంభ సమయంలో ఎకరానికి 2 లక్షల 10 వేయిల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని రైతులకు అందించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ లో భాగంగా ఎకరానికి 6 లక్షల 95 వేయిల రూపాయల చొప్పున నష్టపరిహారంగా రైతులకు అందిస్తుంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారంతో బయట ఎకరం స్థలం కూడా రావడం లేదని 2 ఎకరాల నష్టపరిహారం డబ్బులతో బయట ఎకరం స్థలం కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 350 ఎకరాలకు చెందిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం తమకు సరిపోవడం లేదంటూ నష్టపరిహారం తీసుకోకుండా ఇప్పటికీ భూమిని సాగు చేస్తున్నారు. తమకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటూ వీరు కోర్టును ఆశ్రయించారు. R&R ప్యాకేజీ కింద 936 కుటుంబాలను గుర్తించి కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 136 కుటుంబాలు ఈ నష్టపరిహారం తమకు సరిపోదంటూ కోర్టును ఆశ్రయించారు. ఇందులో 59 మంది పేర్లు ఒకే కుటుంబం కింద గెజిట్ లో ప్రకటించారు. కొంతమందికి గెజిట్ లో పేరు ఉండి కూడా నష్ట పరిహారం అందలేదు. ఇంకా గ్రామంలోని 23 కుటుంబాలను గెజిట్ లో గుర్తించలేదు. ఇంకా 12 కుటుంబాలకు స్ట్రక్చర్
అమౌంట్ అందలేదు. అదేవిధంగా ముంపుకు గురవుతున్న గ్రామంలోని 146 మంది యువకులకు 2015 వరకు కట్ ఆఫ్ పెట్టి 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు 2019 సంవత్సరం వరకు గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువకులకు 8 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. గుడాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి, మద్దలపల్లి, చింతలతండ, సోమాజితండా, జాల్ భయ్ తండాలు ప్రజలకు కూడా ఇంతవరకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదు. నివాసముంటున్న గ్రామంలో ఇంటిని, భూమిని సమస్తమును కోల్పోయి సంవత్సరాల తరబడి నష్టపరిహారం కోసం రెవెన్యూ కార్యాలయల చుట్టూ తిరుగుతున్న తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయి గోదావరి నీటి ప్రవాహం మిడ్ మానేరు నుండి గౌరవెల్లి ప్రాజెక్టుకు త్వరలో రానున్నాయి. ఇప్పటికే దాదాపు 70 నుండి 80 శాతం వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. రానున్న ఆరు నెలల లోపల ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ముంపునకు గురవుతున్న కొంత మంది భూ నిర్వాసితులు ఇంకా తమకు నష్టపరిహారం అందలేదంటూ ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు అధికారులు ఏవిధంగా క్యాంపులు ఏర్పాటు చేసి నష్టపరిహారం అందిస్తున్నారో, అదేవిధంగా తమ గ్రామాలలో కూడా అధికారులు క్యాంపులు ఏర్పాటు చేసి తమ నష్టపరిహార సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత శతాబ్ద కాలంగా గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని నివసిస్తున్న తమకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.


Body:బైట్స్

1) కల్వల రాజిరెడ్డి రైతు భూ నిర్వాసితుడు
2) కొలుపుల సత్తమ్మ భూ నిర్వాసితురాలు
3) రాంపురం లింగారెడ్డి భూ నిర్వాసితుడు
4) గుట్టముక్కుల వెంకటేశం భూ నిర్వాసితుడు
5) బద్ధం రాజిరెడ్డి గుడాటిపల్లి గ్రామ సర్పంచ్


Conclusion:గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామాల భూ నిర్వాసితుల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.