ETV Bharat / briefs

తీర్పును గౌరవిస్తాం... పోరాటం సాగిస్తాం: ఏపీ సీఎం

50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తాము వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిందన్న చంద్రబాబు... ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే తన కోరికని స్పష్టం చేశారు.

author img

By

Published : May 7, 2019, 4:22 PM IST

న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న ఏపీ సీఎం

తాము వేసిన రివ్యూ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేసిన చంద్రబాబు... వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై తామంతా ఒక్కటే కోరామన్నారు. ఎన్నికల నిర్వహణపై పారదర్శకత వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ఉద్ఘాటించారు.

ఈసీ తప్పించుకునేందుకే...
లెక్కింపు ఆలస్యమవుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడమేనన్న ఏపీ సీఎం... కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యమనే విషయాన్ని ఈసీ గుర్తించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని... సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే పోరాటం కొనసాగిస్తామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తామని... తమ పోరాటంతోనే ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు.

2009 నుంచి పోరాటం చేశాం...
వీవీ ప్యాట్‌లు పెట్టాలని 2009 నుంచి పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పోరాటం వల్ల వీవీ ప్యాట్‌లు వచ్చాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించడంలో ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటని బాబు ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి కౌంటింగ్‌ సిబ్బంది సరిపోతారని తెలిపారు. ప్రజాస్వామ్యంలోని అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న ఏపీ సీఎం

ఇదీ చదవండిః అక్షయ తృతీయ నాడు అప్పు తెచ్చి బంగారం కొనొద్దు

తాము వేసిన రివ్యూ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేసిన చంద్రబాబు... వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై తామంతా ఒక్కటే కోరామన్నారు. ఎన్నికల నిర్వహణపై పారదర్శకత వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ఉద్ఘాటించారు.

ఈసీ తప్పించుకునేందుకే...
లెక్కింపు ఆలస్యమవుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడమేనన్న ఏపీ సీఎం... కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యమనే విషయాన్ని ఈసీ గుర్తించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని... సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే పోరాటం కొనసాగిస్తామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల అంశంపై మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్తామని... తమ పోరాటంతోనే ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు.

2009 నుంచి పోరాటం చేశాం...
వీవీ ప్యాట్‌లు పెట్టాలని 2009 నుంచి పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పోరాటం వల్ల వీవీ ప్యాట్‌లు వచ్చాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించడంలో ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటని బాబు ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి కౌంటింగ్‌ సిబ్బంది సరిపోతారని తెలిపారు. ప్రజాస్వామ్యంలోని అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న ఏపీ సీఎం

ఇదీ చదవండిః అక్షయ తృతీయ నాడు అప్పు తెచ్చి బంగారం కొనొద్దు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:కోలంక పూరి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో లో ఈ నెల 17 నుంచి రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు లో కొలంక పూరి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో లో దాస్ అని నారాయణ రావు దాసరి పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 17 నుంచి 20వ తారీకు వరకు రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరుగుతాయి ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు కీర్తిశేషులు గోకరాజు వెంకట శివ రావు సుబ్రహ్మణ్య శర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయ్ భాస్కర్ కి ప్రధానం


బైట్ సాయి కొలంక పూరి నాటక కళాపరిషత్ అధ్యక్షులు




Conclusion:ఈనెల 17 నుంచి కొలకలూరు లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.