ETV Bharat / crime

ఎస్‌బీఐ నుంచి రూ.67కోట్ల రుణం.. జ్యువెలరీ వ్యాపారి అరెస్టు

author img

By

Published : Feb 13, 2022, 11:07 AM IST

Updated : Feb 13, 2022, 3:26 PM IST

ed, Sanjay Agarwal arrested
రుణాల పేరిట ఎస్‌బీఐని మోసం చేశారన్న కేసులో జ్యువెలరీ వ్యాపారి అరెస్టు

11:02 February 13

మనీలాండరింగ్‌ కేసులో సంజయ్‌ అగర్వాల్‌ను అరెస్టు చేసిన ఈడీ

Sanjay Agarwal Case : మనీలాండరింగ్ కేసులో ఘనశ్యామ్ పెరల్స్, జ్యువెలరి భాగస్వామి సంజయ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. 2010-11లో నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో హైదరాబాద్‌లోని ఎస్​బీఐ బ్యాంకులో రూ.67కోట్ల రుణం తీసుకున్నారు. వాటితో బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించారు. అక్రమంగా సంపాదించిన డబ్బునంతా... భార్య, సోదరులు, ఉద్యోగుల పేరిట ఉన్న డొల్ల కంపెనీలకు బదిలీ చేశాడు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం ఎంతకీ కట్టకపోవడంతో అతడిని బ్యాంకు డీఫాల్టర్‌గా తేల్చింది. అనంతరం సంజయ్‌ అగర్వాల్‌ సమర్పించిన పత్రాలు సరిచూడగా... అవి నకిలీవని తేలింది.

జ్యుడిషియల్‌ రిమాండ్‌

బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకముందే... సంజయ్‌ అగర్వాల్‌, ఆయన సోదరులు అజయ్, వినయ్ తెలివిగా... అబిడ్స్‌లోని ఎస్​బీఐ బ్రాంచిలో ఉన్న తమ బంగారాన్ని తీసేసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. గతంలో సుంకం లేకుండా బంగారాన్ని దిగుమతి చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించిన కేసులో... కలకత్తా ఈడీ అధికారులు... అరెస్టు చేశారు. జైల్లో ఉన్న సంజయ్‌ను... పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా... సంజయ్‌కు న్యాయస్థానం జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. సంజయ్ అగర్వాల్​తో పాటు మరికొందరి మీద సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది. వారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత మోసపూరితంగా ఆ బంగారాన్ని తీసేసుకున్నారు. దీనివల్ల పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.31.97 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

గతేడాది కోల్​కతా ఈడీ కేసు

హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్​ను ఈడీ అధికారులు గతేడాది నవంబర్​లో అరెస్టు చేశారు. పుణెలో ఓ వివాహానికి వెళ్తుండగా అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోల్​కతా కోర్టులో హాజరు పరిచారు. కోల్​కతా కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మూడేళ్ల క్రితం సంజయ్ కుమార్ అగర్వాల్, ఆయన కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్​పై కోల్​కతాలో డీఆర్ఐ కేసు నమోదు చేసింది.

అభియోగం ఏంటి?

ఎగుమతుల పేరిట ఎంఎంటీఎస్, డైమండ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సుంకం మినహాయింపు ఉన్న బంగారం దిగుమతి చేసుకున్న సంజయ్ కుమార్ అగర్వాల్.. అక్రమంగా దేశీయంగా చెలామణి చేసినట్లు అభియోగం. డీఆర్ఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న కోల్​కతా ఈడీ అధికారులు.. గతంలో ప్రీత్ కుమార్ అగర్వాల్​ను అరెస్టు చేసింది.

ఇదీ చదవండి: US Shooting: అమెరికాలో ఆగంతకుడి కాల్పులు.. విశాఖ వాసి మృతి

11:02 February 13

మనీలాండరింగ్‌ కేసులో సంజయ్‌ అగర్వాల్‌ను అరెస్టు చేసిన ఈడీ

Sanjay Agarwal Case : మనీలాండరింగ్ కేసులో ఘనశ్యామ్ పెరల్స్, జ్యువెలరి భాగస్వామి సంజయ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. 2010-11లో నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో హైదరాబాద్‌లోని ఎస్​బీఐ బ్యాంకులో రూ.67కోట్ల రుణం తీసుకున్నారు. వాటితో బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించారు. అక్రమంగా సంపాదించిన డబ్బునంతా... భార్య, సోదరులు, ఉద్యోగుల పేరిట ఉన్న డొల్ల కంపెనీలకు బదిలీ చేశాడు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం ఎంతకీ కట్టకపోవడంతో అతడిని బ్యాంకు డీఫాల్టర్‌గా తేల్చింది. అనంతరం సంజయ్‌ అగర్వాల్‌ సమర్పించిన పత్రాలు సరిచూడగా... అవి నకిలీవని తేలింది.

జ్యుడిషియల్‌ రిమాండ్‌

బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకముందే... సంజయ్‌ అగర్వాల్‌, ఆయన సోదరులు అజయ్, వినయ్ తెలివిగా... అబిడ్స్‌లోని ఎస్​బీఐ బ్రాంచిలో ఉన్న తమ బంగారాన్ని తీసేసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. గతంలో సుంకం లేకుండా బంగారాన్ని దిగుమతి చేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించిన కేసులో... కలకత్తా ఈడీ అధికారులు... అరెస్టు చేశారు. జైల్లో ఉన్న సంజయ్‌ను... పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా... సంజయ్‌కు న్యాయస్థానం జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. సంజయ్ అగర్వాల్​తో పాటు మరికొందరి మీద సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది. వారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత మోసపూరితంగా ఆ బంగారాన్ని తీసేసుకున్నారు. దీనివల్ల పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.31.97 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

గతేడాది కోల్​కతా ఈడీ కేసు

హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్​ను ఈడీ అధికారులు గతేడాది నవంబర్​లో అరెస్టు చేశారు. పుణెలో ఓ వివాహానికి వెళ్తుండగా అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోల్​కతా కోర్టులో హాజరు పరిచారు. కోల్​కతా కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మూడేళ్ల క్రితం సంజయ్ కుమార్ అగర్వాల్, ఆయన కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్​పై కోల్​కతాలో డీఆర్ఐ కేసు నమోదు చేసింది.

అభియోగం ఏంటి?

ఎగుమతుల పేరిట ఎంఎంటీఎస్, డైమండ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సుంకం మినహాయింపు ఉన్న బంగారం దిగుమతి చేసుకున్న సంజయ్ కుమార్ అగర్వాల్.. అక్రమంగా దేశీయంగా చెలామణి చేసినట్లు అభియోగం. డీఆర్ఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న కోల్​కతా ఈడీ అధికారులు.. గతంలో ప్రీత్ కుమార్ అగర్వాల్​ను అరెస్టు చేసింది.

ఇదీ చదవండి: US Shooting: అమెరికాలో ఆగంతకుడి కాల్పులు.. విశాఖ వాసి మృతి

Last Updated : Feb 13, 2022, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.