ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు పోలీసులు మృతి

author img

By

Published : May 31, 2020, 5:09 PM IST

Updated : May 31, 2020, 5:42 PM IST

Encounter between police and Naxalite in chaibasa
ఝార్ఖండ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు పోలీసులు మృతి

17:03 May 31

ఝార్ఖండ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు పోలీసులు మృతి

ఝార్ఖండ్​లో నక్సలైట్లతో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.

పశ్చిమ సింగ్​భమ్​ జిల్లా కరాయీకేలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నక్సలైట్లు వారిపై కాల్పులు జరగగా... ఎదురుదాడి చేశారు. ఈ ఎన్​కౌంటర్​లో ఏఎస్పీ మీనా బాడీగార్డ్​, మరో జవాను గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇద్దరు భద్రతా సిబ్బందిని బలిగొన్న నక్సలైట్ల పనిబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో విస్తృతంగా గాలిస్తున్నారు.

17:03 May 31

ఝార్ఖండ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు పోలీసులు మృతి

ఝార్ఖండ్​లో నక్సలైట్లతో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.

పశ్చిమ సింగ్​భమ్​ జిల్లా కరాయీకేలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నక్సలైట్లు వారిపై కాల్పులు జరగగా... ఎదురుదాడి చేశారు. ఈ ఎన్​కౌంటర్​లో ఏఎస్పీ మీనా బాడీగార్డ్​, మరో జవాను గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇద్దరు భద్రతా సిబ్బందిని బలిగొన్న నక్సలైట్ల పనిబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో విస్తృతంగా గాలిస్తున్నారు.

Last Updated : May 31, 2020, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.