ETV Bharat / bharat

'డీఎంకే గెలిస్తే అధికారంలో భాగస్వామ్యం అడగం'

రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే తాము అధికారంలో భాగస్వామ్యం కోరబోమని స్పష్టం చేశారు తమిళనాడు కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి. కాంగ్రెస్​కు 25 సీట్లు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేశారు. తమకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సైతం డీఎంకే సానుకూలంగా ఉందన్నారు.

author img

By

Published : Mar 7, 2021, 5:41 PM IST

"Will not seek share in power from DMK," says TN Congress
'డీఎంకే అధికారంలో భాగస్వామ్యం అడగం'

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే అధికారంలో తాము భాగస్వామ్యం కోరబోమని కాంగ్రెస్​ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కేఎస్ అళగిరి స్పష్టం చేశారు. కాంగ్రెస్​కు ఎన్నికల్లో 25 సీట్లు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేశారు అళగిరి. కాంగ్రెస్​కు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సైతం డీఎంకే సానుకూలంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయటంలేదన్నారు అళగిరి. భాజపాను.. దేశానికి పట్టిన జబ్బుగా ఆయన అభివర్ణించారు. ఆ జబ్బును అందరికీ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

రాష్ట్రంలో 'కామ్​రాజ్​ రాజ్యం' నినాదానికి ప్రాముఖ్యం ఇవ్వటంలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎన్నికల్లో భాజపాను ఓడించి కామ్​ రాజ్​ రాజ్యం తీసుకొస్తామన్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే అధికారంలో తాము భాగస్వామ్యం కోరబోమని కాంగ్రెస్​ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కేఎస్ అళగిరి స్పష్టం చేశారు. కాంగ్రెస్​కు ఎన్నికల్లో 25 సీట్లు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేశారు అళగిరి. కాంగ్రెస్​కు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సైతం డీఎంకే సానుకూలంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయటంలేదన్నారు అళగిరి. భాజపాను.. దేశానికి పట్టిన జబ్బుగా ఆయన అభివర్ణించారు. ఆ జబ్బును అందరికీ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

రాష్ట్రంలో 'కామ్​రాజ్​ రాజ్యం' నినాదానికి ప్రాముఖ్యం ఇవ్వటంలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎన్నికల్లో భాజపాను ఓడించి కామ్​ రాజ్​ రాజ్యం తీసుకొస్తామన్నారు.

ఇదీ చదవండి : తమిళనాట 25 చోట్ల బరిలో కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.