ETV Bharat / bharat

హిమాచల్​ సీఎం రేస్​లో ఐదుగురు.. ఆ భయంతో కాంగ్రెస్​ క్యాంప్​ రాజకీయం!

author img

By

Published : Dec 8, 2022, 5:14 PM IST

హిమాచల్ ​ప్రదేశ్​లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని నిర్ణయించే పనిలో హైకమాండ్​​ నిమగ్నమైంది. సీఎం రేసులో అనేక మంది నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అధిష్ఠానమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని తెలిపాయి. అలాగే పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు.. భాజపా వలలో పడకుండా చండీ​గఢ్​కు తరలించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్.

himachal Pradesh election result 2022
హిమాచల్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 68 స్థానాలకుగానూ 40 స్థానాల్లో గెలిచింది. భాజపా 25 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. దీంతో హిమాచల్​కు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఎవరు రాష్ట్ర పగ్గాలు చేపట్టునున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి పదవిని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్​కు తలనొప్పిగా మారింది. అయితే ముఖ్యంగా ఐదుగురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు. హిమాచల్​ ప్రదేశ్​లో కాంగ్రెస్ విజయం సాధించడం వల్ల ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు బూస్ట్​ను ఇచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్​ జాగ్రత్తపడుతోంది. హిమాచల్​ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, ఏఐసీసీ పరిశీలకులు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్, సీనియర్ నేత భూపిందర్​ సింగ్ హుడాను సిమ్లాకు పంపించింది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చండీగఢ్​కు తరలించనున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. అక్కడే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్ అధిష్ఠానం ఛత్తీస్​గడ్​ సీఎం భూపేశ్ బఘేల్​, సీనియర్ భూపిందర్​ సింగ్​ హుడాను పరిశీలకులుగా హిమాచల్​కు పంపుతోంది. ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులను ఛండీ​గఢ్​కు తరలిస్తాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన 10 హామీలను నెరవేరుస్తాం. హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్ గెలుపు.. ప్రజల విజయం. '

--రాజీవ్ శుక్లా, హిమాచల్​ప్రదేశ్​ కాంగ్రెస్ ఇంఛార్జ్

జైరాం ఠాకూర్ రాజీనామా..
హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​ తన రాజీనామా లేఖను గవర్నర్​కు సమర్పించారు. 'ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. నాకు గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటాం.' అని జైరాం ఠాకూర్ తెలిపారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 68 స్థానాలకుగానూ 40 స్థానాల్లో గెలిచింది. భాజపా 25 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. దీంతో హిమాచల్​కు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఎవరు రాష్ట్ర పగ్గాలు చేపట్టునున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి పదవిని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్​కు తలనొప్పిగా మారింది. అయితే ముఖ్యంగా ఐదుగురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు. హిమాచల్​ ప్రదేశ్​లో కాంగ్రెస్ విజయం సాధించడం వల్ల ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు బూస్ట్​ను ఇచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్​ జాగ్రత్తపడుతోంది. హిమాచల్​ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, ఏఐసీసీ పరిశీలకులు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్, సీనియర్ నేత భూపిందర్​ సింగ్ హుడాను సిమ్లాకు పంపించింది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చండీగఢ్​కు తరలించనున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. అక్కడే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్ అధిష్ఠానం ఛత్తీస్​గడ్​ సీఎం భూపేశ్ బఘేల్​, సీనియర్ భూపిందర్​ సింగ్​ హుడాను పరిశీలకులుగా హిమాచల్​కు పంపుతోంది. ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులను ఛండీ​గఢ్​కు తరలిస్తాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన 10 హామీలను నెరవేరుస్తాం. హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్ గెలుపు.. ప్రజల విజయం. '

--రాజీవ్ శుక్లా, హిమాచల్​ప్రదేశ్​ కాంగ్రెస్ ఇంఛార్జ్

జైరాం ఠాకూర్ రాజీనామా..
హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​ తన రాజీనామా లేఖను గవర్నర్​కు సమర్పించారు. 'ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. నాకు గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటాం.' అని జైరాం ఠాకూర్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.