ETV Bharat / bharat

బంగాల్​లో ప్రశాంతంగా ఆరో విడత పోలింగ్​

author img

By

Published : Apr 22, 2021, 6:36 PM IST

బంగాల్ శాసనసభ ఎన్నికల​ ఆరో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 79.08 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అక్కడక్కడా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ సజావుగా సాగినట్లు పేర్కొన్నారు.

Bengal polls
బంగాల్​ ఆరో విడత పోలింగ్​

బంగాల్​ శాసనసభ ఎన్నికల ఆరో విడత పోలింగ్​ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 79.08 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు.

కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్​ జరగగా.. కొవిడ్​ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ఈసీ.

పలు చోట్ల ఉద్రిక్తత

జగ్​ద్దాల్​ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు పోలింగ్ ఏజెంట్లు కనబడకుండా పోయారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్​ ద్వారాను వారి ఆచూకీ లభించటం లేదని పేర్కొంది. జిల్లాలోని మేఘ్నా ప్రాంతంలో బాంబు దాడులు జరిగిన క్రమంలో వారు గల్లంతైనట్లు తెలిపింది. ​

మరోవైపు.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అధికార టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టాయి. జిల్లాలోని అందాంగలో 131, 132 పోలింగ్​ బూత్​లలో డ్రోన్ల సాయంతో నిఘా వేశారు అధికారులు. జిల్లాలోని తితాగఢ్​ అసెంబ్లీ నియోజకవర్గంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర దినాజ్​పుర్​లోని ఖునియా గ్రామంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.

మే 2న ఫలితాలు..

బంగాల్​లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఏడో దశ ఏప్రిల్​ 26న, చివరి దశ ఏప్రిల్​ 29న జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: బంగాల్​లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు

బంగాల్​ శాసనసభ ఎన్నికల ఆరో విడత పోలింగ్​ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 79.08 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు.

కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్​ జరగగా.. కొవిడ్​ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ఈసీ.

పలు చోట్ల ఉద్రిక్తత

జగ్​ద్దాల్​ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు పోలింగ్ ఏజెంట్లు కనబడకుండా పోయారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్​ ద్వారాను వారి ఆచూకీ లభించటం లేదని పేర్కొంది. జిల్లాలోని మేఘ్నా ప్రాంతంలో బాంబు దాడులు జరిగిన క్రమంలో వారు గల్లంతైనట్లు తెలిపింది. ​

మరోవైపు.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అధికార టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టాయి. జిల్లాలోని అందాంగలో 131, 132 పోలింగ్​ బూత్​లలో డ్రోన్ల సాయంతో నిఘా వేశారు అధికారులు. జిల్లాలోని తితాగఢ్​ అసెంబ్లీ నియోజకవర్గంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర దినాజ్​పుర్​లోని ఖునియా గ్రామంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.

మే 2న ఫలితాలు..

బంగాల్​లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఏడో దశ ఏప్రిల్​ 26న, చివరి దశ ఏప్రిల్​ 29న జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: బంగాల్​లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.