ETV Bharat / bharat

కరోనాను జయించిన సీఎం- ఎయిమ్స్​ నుంచి డిశ్చార్జ్​

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్ కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజులుగా దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొన్ని రోజులు దేశరాజధానిలోనే స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.

author img

By

Published : Jan 2, 2021, 4:18 PM IST

Uttarakhand CM discharged from AIIMS, to remain in home isolation in Delhi
కరోనాను జయించిన సీఎం- ఎయిమ్స్​ నుంచి డిశ్చార్జ్​

కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్ పూర్తిగా కోలుకున్నారు. డిసెంబర్​ 28నుంచి ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకా కొన్ని రోజుల పాటు దిల్లీలోని నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొన్నారు.

త్రివేంద్ర సింగ్ రావత్​కు​ డిసెంబర్​ 18న కరోనా పాజిటివ్​గా తేలింది. ఆరోగ్యం క్షీణించి డిసెంబర్ 27న దేహ్రాదూన్​లోని ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్​ఫెక్షన్​ గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఆ మరునాడే దిల్లీలోని ఎయిమ్స్​కు తరలించారు.

కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్ పూర్తిగా కోలుకున్నారు. డిసెంబర్​ 28నుంచి ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకా కొన్ని రోజుల పాటు దిల్లీలోని నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొన్నారు.

త్రివేంద్ర సింగ్ రావత్​కు​ డిసెంబర్​ 18న కరోనా పాజిటివ్​గా తేలింది. ఆరోగ్యం క్షీణించి డిసెంబర్ 27న దేహ్రాదూన్​లోని ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్​ఫెక్షన్​ గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఆ మరునాడే దిల్లీలోని ఎయిమ్స్​కు తరలించారు.

ఇదీ చూడండి: రిపబ్లిక్ డే రోజున '‌కిసాన్‌ పరేడ్'‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.