ETV Bharat / bharat

వాన బీభత్సం.. ఒక్కరోజే 39 మంది మృతి

author img

By

Published : May 25, 2022, 7:18 AM IST

UP Rain News: ఉత్తర్​ప్రదేశ్​లో వర్షాల బీభత్సానికి ఒక్కరోజే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

rain news update
UP rain news

UP Rain News: ఉత్తర్​ప్రదేశ్​లో కురిసిన వర్షాలకు భారీగా ప్రాణనష్టం జరిగింది. వర్షపాతం ధాటికి సోమవారం ఒక్కరోజే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎక్కువ శాతం మరణాలు.. ఈదురు గాలులు, పిడుగుపాటు, వరదల కారణంగానే సంభవించాయి. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆగ్రా, వారణాసి, గాజీపుర్​, ప్రతాప్​గఢ్​ సహా 18 ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర ప్రభావం చూపించినట్లు తెలిపారు.

మృతుల కుటుంబసభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వర్షాల బీభత్సం కారణంగా మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. సోమవారం మరో మూడు జంతువులు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

UP Rain News: ఉత్తర్​ప్రదేశ్​లో కురిసిన వర్షాలకు భారీగా ప్రాణనష్టం జరిగింది. వర్షపాతం ధాటికి సోమవారం ఒక్కరోజే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎక్కువ శాతం మరణాలు.. ఈదురు గాలులు, పిడుగుపాటు, వరదల కారణంగానే సంభవించాయి. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆగ్రా, వారణాసి, గాజీపుర్​, ప్రతాప్​గఢ్​ సహా 18 ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర ప్రభావం చూపించినట్లు తెలిపారు.

మృతుల కుటుంబసభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వర్షాల బీభత్సం కారణంగా మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. సోమవారం మరో మూడు జంతువులు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బాయ్​ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిల కొట్లాట.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.