ETV Bharat / bharat

'ఉన్నావ్'​ బాధితురాలి యాక్సిడెంట్​ కేసులో నిర్దోషిగా కుల్​దీప్ ​

Kuldeep Singh Sengar: 2019లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె న్యాయవాదిపై జరిగిన యాక్సిడెంట్ కేసులో ఉన్నావ్ కేసు దోషి, భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్ సెంగార్​ను దిల్లీలోని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది.

author img

By

Published : Dec 21, 2021, 12:35 AM IST

Kuldeep Singh Sengar
కుల్​దీప్ సెంగార్​

Kuldeep Singh Sengar: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె న్యాయవాదిపై యాక్సిడెంట్ కేసులో ఉన్నావ్ అత్యాచార కేసు దోషి, భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సెంగార్​ను దిల్లీలోని ది రౌస్​ ఎవెన్యూ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్​ రవీంద్ర కుమార్ పాండే ఆదేశాలు జారీ చేశారు.

అసలేంటీ కేసు..?

2019 జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సెంగార్​తో పాటు మరో 12 మంది ఈ ఘటనలో నిందితులుగా తేలారు. విచారణ సమయంలో సీబీఐ.. సెంగారే ఈ నేరానికి పాల్పడ్డానికి తమకు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో సెంగార్​ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన... ఉన్నావ్ అత్యాచార కేసులో 2019 డిసెంబరు 20న కుల్​దీప్ సెంగార్​కు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేగాకుండా... రూ.25 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ.10 లక్షలను బాధితురాలి కుటుంబానికి అందించాలని పేర్కొంది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును సెంగార్ ఆశ్రయించారు.

ఇదీ చూడండి: 'భాజపాకు త్వరలోనే చెడ్డ రోజులు.. ఇదే నా శాపం'

Kuldeep Singh Sengar: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె న్యాయవాదిపై యాక్సిడెంట్ కేసులో ఉన్నావ్ అత్యాచార కేసు దోషి, భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సెంగార్​ను దిల్లీలోని ది రౌస్​ ఎవెన్యూ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్​ రవీంద్ర కుమార్ పాండే ఆదేశాలు జారీ చేశారు.

అసలేంటీ కేసు..?

2019 జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సెంగార్​తో పాటు మరో 12 మంది ఈ ఘటనలో నిందితులుగా తేలారు. విచారణ సమయంలో సీబీఐ.. సెంగారే ఈ నేరానికి పాల్పడ్డానికి తమకు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో సెంగార్​ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన... ఉన్నావ్ అత్యాచార కేసులో 2019 డిసెంబరు 20న కుల్​దీప్ సెంగార్​కు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేగాకుండా... రూ.25 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ.10 లక్షలను బాధితురాలి కుటుంబానికి అందించాలని పేర్కొంది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును సెంగార్ ఆశ్రయించారు.

ఇదీ చూడండి: 'భాజపాకు త్వరలోనే చెడ్డ రోజులు.. ఇదే నా శాపం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.