దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆరో రోజు వ్యాక్సిన్ తీసుకున్నారు.
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, నితిన్ గడ్కరీలు టీకా వేయించుకున్నారు. సినీ ప్రముఖుల్లో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని, నటుడు జానీలీవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
ముంబయిలోని కూపర్ ఆస్పత్రిలో తొలి డోసును తీసుకుంటున్న సినీ నటి, భాజపా ఎంపీ హేమమాలిని ముంబయి బీకేసీ వ్యాక్సిన్ సెంటర్ వద్ద టీకా అందుకుంటున్న నటుడు జానీ లీవర్ దిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో టీకా అందుకుంటున్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాగ్పూర్లోని ఏయిమ్స్లో వ్యాక్సిన్ అందుకుంటున్న కేంద్ర మంత్రి గడ్కరీ దంపతులు బెంగళూరులో వ్యాక్సిన్ తీసుకుంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో వ్యాక్సిన్ అందుకుంటున్న దలాయ్ లామా ఇదీ చదవండి : 'కట్, కాపీ, పేస్ట్' విధానంపై సుప్రీం అసహనం