ETV Bharat / bharat

ఫ్యాక్టరీ గోడ కూలి 8 మంది కూలీలు దుర్మరణం

రాజస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Nov 10, 2020, 11:45 PM IST

Updated : Nov 11, 2020, 1:57 AM IST

6 labourers killed, 10 injured as wall of under-construction factory collapses in Jodhpur
జోధ్​పుర్​లో కూలిన ఫ్యాక్టరీ గోడ- ఆరుగురు కూలీలు దుర్మరణం

రాజస్థాన్​లో జోధ్​పుర్​లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి 8 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారని పోలీసులు తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మృతదేహాలను వెలికితీశారు. బస్నీ ఇండస్ట్రియల్​ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. కార్మికుల మరణ వార్త చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చదవండి: వివాహిత ముక్కు కోసిన భగ్న ప్రేమికుడు

రాజస్థాన్​లో జోధ్​పుర్​లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి 8 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారని పోలీసులు తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మృతదేహాలను వెలికితీశారు. బస్నీ ఇండస్ట్రియల్​ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. కార్మికుల మరణ వార్త చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చదవండి: వివాహిత ముక్కు కోసిన భగ్న ప్రేమికుడు

Last Updated : Nov 11, 2020, 1:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.