ETV Bharat / bharat

ఆరు నెలల కవలలు మృతి.. వంట చేస్తుంటే ఉయ్యాలకు మంటలు...

గుడిసెకు నిప్పు అంటుకుని.. ముక్కుపచ్చలారని కవలలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో చిన్నారులు ఉయ్యాలలో నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లో జరిగింది.

author img

By

Published : Nov 10, 2021, 3:50 PM IST

twins
అగ్నిప్రమాదం

ప్రమాదవశాత్తు ఓ గుడిసెలో జరిగిన అగ్నిప్రమాదానికి ముక్కుపచ్చలారని కవలలు బలయ్యారు. ఉయ్యాలలో నిద్రపోతూనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో ఈ విషాదం జరిగింది.

ఏం జరిగిందంటే..?

ఉదయ్​పుర్ జిల్లా కోట్​ఢా పోలీస్ స్టేషన్ పరిధిలోని జంబువా ఫలా గ్రామానికి చెందిన ఉజ్మా అనే వ్యక్తికి భార్య, ఆరు నెలల కవలలు ఉన్నారు. అయితే మంగళవారం చిన్నారులను ఉయ్యాలలో నిద్రపుచ్చి తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయారు. దీంతో మంటలు పొయ్యి నుంచి వారు నివసిస్తున్న గుడిసెకు అంటుకున్నాయి.

twins-burnt-alive-at-kotra-in-udaipur
అగ్నిప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు

చిన్నారుల ఏడుపు విన్న తల్లిదండ్రులు, గ్రామస్థులు, వెంటనే అక్కడకు చేరుకుని.. అతికష్టం మీద వారిని బయటకు తీసుకొచ్చారు. కవలలను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఉదయ్​పుర్​కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేసేదేంలేక.. చిన్నారులను ఉదయ్​పుర్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే వాళ్లు మృతిచెందారు.

సమాచారం అందిన వెంటనే కోట్​ఢా స్టేషన్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలోంచి ఎగిసిన మంటల కారణంగానే గుడిసెకు నిప్పంటుకున్నట్లు నిర్ధరించారు.

ఇదీ చూడండి: ట్రక్కు, బస్సు ఢీ- 11 మంది మృతి

ప్రమాదవశాత్తు ఓ గుడిసెలో జరిగిన అగ్నిప్రమాదానికి ముక్కుపచ్చలారని కవలలు బలయ్యారు. ఉయ్యాలలో నిద్రపోతూనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో ఈ విషాదం జరిగింది.

ఏం జరిగిందంటే..?

ఉదయ్​పుర్ జిల్లా కోట్​ఢా పోలీస్ స్టేషన్ పరిధిలోని జంబువా ఫలా గ్రామానికి చెందిన ఉజ్మా అనే వ్యక్తికి భార్య, ఆరు నెలల కవలలు ఉన్నారు. అయితే మంగళవారం చిన్నారులను ఉయ్యాలలో నిద్రపుచ్చి తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయారు. దీంతో మంటలు పొయ్యి నుంచి వారు నివసిస్తున్న గుడిసెకు అంటుకున్నాయి.

twins-burnt-alive-at-kotra-in-udaipur
అగ్నిప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు

చిన్నారుల ఏడుపు విన్న తల్లిదండ్రులు, గ్రామస్థులు, వెంటనే అక్కడకు చేరుకుని.. అతికష్టం మీద వారిని బయటకు తీసుకొచ్చారు. కవలలను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఉదయ్​పుర్​కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేసేదేంలేక.. చిన్నారులను ఉదయ్​పుర్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే వాళ్లు మృతిచెందారు.

సమాచారం అందిన వెంటనే కోట్​ఢా స్టేషన్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలోంచి ఎగిసిన మంటల కారణంగానే గుడిసెకు నిప్పంటుకున్నట్లు నిర్ధరించారు.

ఇదీ చూడండి: ట్రక్కు, బస్సు ఢీ- 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.