ETV Bharat / bharat

అసెంబ్లీ నుంచి కోట వరకు సొరంగం- ఇన్నేళ్లకు గుర్తించారు! - దిల్లీ అసెంబ్లీ స్పీకర్​ రామ్ నివాస్​ గోయెల్

బ్రిటిషర్లు వినియోగించిన ఓ అరుదైన సొరంగ మార్గం(Tunnel in assembly).. దిల్లీ శాసనసభలో(delhi legislative assembly) బయటపడింది. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని దిల్లీ శాసనసభ స్పీకర్​ రామ్​ నివాస్​ గోయల్​ తెలిపారు.

tunnel in delhi legislative assmebly
దిల్లీ శాసనసభలో సొరంగం
author img

By

Published : Sep 3, 2021, 10:26 AM IST

దిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ అరుదైన నిర్మాణం బయటపడింది. సొరంగం తరహా మార్గాన్ని(Tunnel in assembly) తాము కనుగొన్నామని దిల్లీ శాసనసభ స్పీకర్ రామ్​ నివాస్ గోయల్​ తెలిపారు. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారని చెప్పారు.

tunnel in delhi assembly
దిల్లీ శాసన సభలో సొరంగం ముఖద్వారం తెరుస్తున్న అధికారి
tunnel in delhi assembly
దిల్లీ శాసనసభలోని సొరంగం

"నేను 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఎర్రకోటను కలిపే సొరంగ మార్గం దిల్లీ అసెంబ్లీలో ఉందని మాట్లాడుకోవడం విన్నాను. నేను ఆ చరిత్ర కోసం వెతికాను. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ, ఇప్పుడు మాకు ఈ సొరంగ ముఖద్వారం కనిపించింది. కానీ, దీన్ని మేము మరింత తవ్వాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మెట్రో పిల్లర్లు, డ్రైనేజీ కాల్వల కోసం దీన్ని చాలా వరకు పూడ్చేశారు."

-రామ్ నివాస్​ గోయల్​, దిల్లీ అసెంబ్లీ స్పీకర్​

1912లో దేశ రాజధానిని కోల్​కతా నుంచి దిల్లీకి తరలించిన తర్వాత... కేంద్ర శాసనసభగా ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ భవనాన్ని వినియోగించారని నివాస్​ గోయల్​ తెలిపారు. 1926లో దీన్ని న్యాయస్థానంగా ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ సమయంలో స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గం ద్వారా న్యాయస్థానానికి తీసుకువచ్చేవారన్నారు.

tunnel in delhi assembly
సొరంగ మార్గం లోపలి దృశ్యం
tunnel in delhi assembly
దిల్లీ శాసనసభ

వచ్చే స్వాతంత్య్ర వేడుకల నాటికి..

"ఈ ప్రాంతంలో ఓ ఉరికంబపు గది(Gallows room in delhi assembly) ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ, ఇంతవరకు దాన్ని ఎప్పుడూ తెరవలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన నేపథ్యంలో నేను ఆ గదిని పరిశీలించాలని నిశ్చయించుకున్నాను. ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి నిలయంగా మార్చి, వారికి నివాళి అర్పించాలనుకుంటున్నాం" అని నివాస్​ గోయల్ తెలిపారు. ఆ గదిని వచ్చే స్వాతంత్య్ర వేడుకల నాటికి పర్యటకులకు అనుమతించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ ప్రభుత్వం విఫలం'

ఇదీ చూడండి: 'కుల ధ్రువీకరణపై పదేపదే విచారణ హానికరం'

దిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ అరుదైన నిర్మాణం బయటపడింది. సొరంగం తరహా మార్గాన్ని(Tunnel in assembly) తాము కనుగొన్నామని దిల్లీ శాసనసభ స్పీకర్ రామ్​ నివాస్ గోయల్​ తెలిపారు. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారని చెప్పారు.

tunnel in delhi assembly
దిల్లీ శాసన సభలో సొరంగం ముఖద్వారం తెరుస్తున్న అధికారి
tunnel in delhi assembly
దిల్లీ శాసనసభలోని సొరంగం

"నేను 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఎర్రకోటను కలిపే సొరంగ మార్గం దిల్లీ అసెంబ్లీలో ఉందని మాట్లాడుకోవడం విన్నాను. నేను ఆ చరిత్ర కోసం వెతికాను. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ, ఇప్పుడు మాకు ఈ సొరంగ ముఖద్వారం కనిపించింది. కానీ, దీన్ని మేము మరింత తవ్వాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మెట్రో పిల్లర్లు, డ్రైనేజీ కాల్వల కోసం దీన్ని చాలా వరకు పూడ్చేశారు."

-రామ్ నివాస్​ గోయల్​, దిల్లీ అసెంబ్లీ స్పీకర్​

1912లో దేశ రాజధానిని కోల్​కతా నుంచి దిల్లీకి తరలించిన తర్వాత... కేంద్ర శాసనసభగా ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ భవనాన్ని వినియోగించారని నివాస్​ గోయల్​ తెలిపారు. 1926లో దీన్ని న్యాయస్థానంగా ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ సమయంలో స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గం ద్వారా న్యాయస్థానానికి తీసుకువచ్చేవారన్నారు.

tunnel in delhi assembly
సొరంగ మార్గం లోపలి దృశ్యం
tunnel in delhi assembly
దిల్లీ శాసనసభ

వచ్చే స్వాతంత్య్ర వేడుకల నాటికి..

"ఈ ప్రాంతంలో ఓ ఉరికంబపు గది(Gallows room in delhi assembly) ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ, ఇంతవరకు దాన్ని ఎప్పుడూ తెరవలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన నేపథ్యంలో నేను ఆ గదిని పరిశీలించాలని నిశ్చయించుకున్నాను. ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి నిలయంగా మార్చి, వారికి నివాళి అర్పించాలనుకుంటున్నాం" అని నివాస్​ గోయల్ తెలిపారు. ఆ గదిని వచ్చే స్వాతంత్య్ర వేడుకల నాటికి పర్యటకులకు అనుమతించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ ప్రభుత్వం విఫలం'

ఇదీ చూడండి: 'కుల ధ్రువీకరణపై పదేపదే విచారణ హానికరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.