ETV Bharat / bharat

రేపే 'తిరంగా బైక్ ర్యాలీ'.. అన్ని పార్టీల ఎంపీలు కలిసికట్టుగా..

author img

By

Published : Aug 2, 2022, 3:12 PM IST

Tiranga bike rally: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరగనున్న 'తిరంగా బైక్​ ర్యాలీ'లో అన్ని పార్టీల ఎంపీలు పాల్గొనాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు.

tiranga bike rally
తిరంగా బైక్ ర్యాలీ

Tiranga bike rally: కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం 'తిరంగా బైక్ ర్యాలీ' నిర్వహించనుంది. ఎర్రకోట నుంచి పార్లమెంట్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​'లో భాగంగా పలు కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తోంది. దిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పలు విషయాలను వెల్లడించారు. తిరంగా బైక్ ర్యాలీ.. పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల ఎంపీలు పాల్గొనాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​'లో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్‌ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. అలాగే పార్లమెంటరీ పార్టీ మీటింగ్​లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పలు కార్యక్రమాలు చేయాలని సూచించారు.

''భాజపా కార్యకర్తలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 'హర్​ ఘర్​ తిరంగా' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశ వ్యాప్తంగా ఉన్న యువ కార్యకర్తలు 'తిరంగా బైక్​ ర్యాలీ'లో పాల్గొనాలి. అలాగే ఆగస్టు 11 నుంచి 13 వరకు మహాత్మా గాంధీకి ఇష్టమైన 'రఘుపతి రాఘవ రాజారామ్', 'వందేమాతరం' గీతాల్ని ఆలపించాలి.''

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఆగస్టు 7న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 5న మరోసారి భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్​డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్​ఖడ్ బరిలో నిలవగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్​ ఆళ్వా పోటీలో ఉన్నారు.

ఇవీ చదవండి: గుడికి వెళ్తూ ఏడుగురు మృతి.. ఆ సరస్సులో దిగడమే వారి తప్పు!

'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఇంజినీర్​కు రూ.25లక్షలు లాస్!

Tiranga bike rally: కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం 'తిరంగా బైక్ ర్యాలీ' నిర్వహించనుంది. ఎర్రకోట నుంచి పార్లమెంట్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​'లో భాగంగా పలు కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తోంది. దిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పలు విషయాలను వెల్లడించారు. తిరంగా బైక్ ర్యాలీ.. పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల ఎంపీలు పాల్గొనాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​'లో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్‌ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. అలాగే పార్లమెంటరీ పార్టీ మీటింగ్​లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పలు కార్యక్రమాలు చేయాలని సూచించారు.

''భాజపా కార్యకర్తలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 'హర్​ ఘర్​ తిరంగా' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశ వ్యాప్తంగా ఉన్న యువ కార్యకర్తలు 'తిరంగా బైక్​ ర్యాలీ'లో పాల్గొనాలి. అలాగే ఆగస్టు 11 నుంచి 13 వరకు మహాత్మా గాంధీకి ఇష్టమైన 'రఘుపతి రాఘవ రాజారామ్', 'వందేమాతరం' గీతాల్ని ఆలపించాలి.''

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఆగస్టు 7న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 5న మరోసారి భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎన్​డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్​ఖడ్ బరిలో నిలవగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్​ ఆళ్వా పోటీలో ఉన్నారు.

ఇవీ చదవండి: గుడికి వెళ్తూ ఏడుగురు మృతి.. ఆ సరస్సులో దిగడమే వారి తప్పు!

'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఇంజినీర్​కు రూ.25లక్షలు లాస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.