ETV Bharat / bharat

ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారిన ఒకే పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 6:25 AM IST

Telangana Election Same Name Candidates : ఎన్నికలు అన్నాక ఎత్తులు, పైఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. అవకాశం ఉన్న ఏ ఎత్తుగడనూ నేతలు వదులుకోరు. తన గెలుపు, ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు పావులు కదుపుతుంటారు. నామినేషన్ల దాఖలు సమయం నుంచే ఈ తరహా వ్యూహాలను అవలంభించడం సహజం. ఒకే పేరు ఉన్న అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించడం కూడా అందులో భాగం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వ్యూహం కొన్ని నియోజకవర్గాల్లో అమలవుతోంది.

Telangana Election
Telangana Election Same Name Candidates
ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారిన ఒకే పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు

Telangana Election Same Name Candidates : శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు కూడా ఉన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు(MLA Candidates List 2023) దాదాపుగా సరిపోలుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో దాదాపుగా ఒకే పేరు ఉన్న అభ్యర్థులు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో నిలిచారు. ఓటర్లను తికమక పెట్టేందుకు ప్రత్యర్థులు సహజంగా ఈ ఎత్తుగడను వినియోగిస్తుంటారు. తాజా ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల ఈ తరహా వ్యూహాన్ని అవలంభించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన వారితో రిజిస్టర్డ్ పార్టీ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేయించారు. అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈ తరహా పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కొందరు అదే నియోజకవర్గాలకు వారు ఈ తరహా నామినేషన్లు దాఖలు చేయగా.. మరికొందరు మాత్రం తమ సొంత జిల్లాలను కాదని వెళ్లి మరీ మరోచోట నామినేషన్లు దాఖలు చేశారు. సిర్పూర్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. డోంగ్రి ప్రవీణ్ కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దిగారు. నిర్మల్​లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఉండగా.. మంతెన ఇంద్రకరణ్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బోధన్​లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి కాంగ్రెస్ అభ్యర్థి కాగా.. సుదర్శన్ రాజ్ ఆకులపల్లి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్​ఎస్​ తరపున ఎన్నికల బరిలో దిగగా.. చంద్రశేఖర్ చలిక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన నివాసం కూకట్ పల్లి, మేడ్చెల్ జిల్లా. కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ బీఆర్​ఎస్​ తరపున పోటీ చేస్తుండగా.. గుర్రం కమలాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

Telangana Elections 2023 : పురుమాల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, నల్లాల శ్రీనివాస్ బీఎస్పీ నుంచి పోటీలో ఉండగా.. బండి శ్రీనివాస్ ఇండియా జనశక్తి పార్టీ, పెంచల శ్రీనివాస్ ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్నారు. సిరిసిల్లలో రెడ్డిమల్ల శ్రీనివాస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా, లగిశెట్టి శ్రీనివాస్ విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి, తాటిపాముల శ్రీనివాస్ - స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మెదక్​లో పద్మా దేవేందర్​ రెడ్డి బీఆర్​ఎస్​(BRS) నుంచి బరిలో ఉండగా.. లంసగల్ల పద్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఎన్నికల వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్

మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా.. వనపర్తి రోహిత్ భారత చైతన్య యువజన పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆందోల్​లో చంటి క్రాంతి కిరణ్​ బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఉండగా.. ఎన్​. క్రాంతి కుమార్​, పి. క్రాంతి కుమార్​ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నర్సాపూర్​లో సునీతా లక్ష్మారెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీలో ఉండగా.. చేకూర్తి లక్ష్మారెడ్డి, పిల్లుట్ల లక్ష్మి, బిడిమట్ట లక్ష్మి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జహీరాబాద్​లో ఎ. చంద్రశేఖర్​ కాంగ్రెస్​ అభ్యర్థి కాగా.. బి. చంద్రకాంత్​ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.

సబితా ఇంద్రారెడ్డి బీఆర్​ఎస్​.. సబితా మద్ది స్వతంత్ర పార్టీ : మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉండగా.. రాజశేఖర్ రెడ్డి వీరయ్యగారి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఉప్పల్​లో బండారి లక్ష్మారెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. లక్ష్మారెడ్డి మన్నె అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనది యాదాద్రి జిల్లా పెద్దగూడెం. ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉండగా అదే పేరు కలిగిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి దేప అనే అభ్యర్థి కూడా స్వతంత్రంగా బరిలో ఉన్నారు. మహేశ్వరంలో పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉండగా.. సబితా మద్ది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందె శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి పోటీలో ఉంటే.. టి.శ్రీరాములు యాదవ్ భారతీయ క్రాంతిసంఘ్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తుండగా.. కె.కిషన్ రెడ్డి అలయెన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజేంద్ర నగర్​లో తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటే.. కొలుకూరి శ్రీనివాస్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

పరిగిలో కె.మహేశ్ రెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. మహేశ్ రెడ్డి బారెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనిది నల్గొండ జిల్లా నిడమనూరు. వికారాబాద్ లో డాక్టర్ ఆనంద్ మెతుకు బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. బి. ఆనంద్ కుమార్-అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిపార్మ్స్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇతనిది రంగారెడ్డి జిల్లా శంషాబాద్. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి - బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీలో ఉండగా.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన పి.రోహిత్ రెడ్డి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. బి.మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా.. డి.మనోహర్ రెడ్డి జన శంఖారావం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కొడంగల్​లో పట్నం నరేందర్ రెడ్డి-బీఆర్​ఎస్​ అభ్యర్ధి కాగా.. నరేందర్ రెడ్డి ప్యాట ఇండిపెండెంట్​గా పోటీలో నిలిచారు. నారాయణపేటలో ఎస్.రాజేందర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉండగా.. కొండాపూర్ రాజేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. మహబూబ్ నగర్ -యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, సి.శ్రీనివాస్ రెడ్డి జన శంఖారావం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. ఎం.శ్రీనివాసులు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.

ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్

Telangana Election Polls 2023 : దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉంటే.. ఎం.వెంకటేశ్వర్ రెడ్డి-స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. గవినోళ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, బండ మధుసూదన రెడ్డి-జన శంఖారావం పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. గద్వాలలో సరిత కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండగా.. జి.సరిత నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మరో సరిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసున్నారు. అక్కడ కె.శ్రీనివాసులు పేరిట ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఉండగా.. బాలరాజు గుడ్డటి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తుండగా.. నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన కీసరి హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ చైతన్యపురికి చెందిన ఎ.హర్షవర్ధన్ రావు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి-కాంగ్రెస్ అభ్యర్థిగా, బారెడ్డి లక్ష్మారెడ్డి-స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

బీఆర్​ఎస్​కు స్వతంత్రల గండం : హుజూర్ నగర్​లో సైదిరెడ్డి శానంపూడి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తుండగా.. తిమ్మారెడ్డి సైదిరెడ్డి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి, మారం వెంకట్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉండగా.. కంచర్ల ఆనంద్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్​ఎస్​ తరపున, కట్టా ప్రభాకర్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉన్నారు. అక్కడ. అజయ్ కుమార్ అన్నాబత్తుల, కుక్కల అజయ్ హార్ధిక్ స్వతంత్ర అభ్యర్తులుగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారిన ఒకే పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు

Telangana Election Same Name Candidates : శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు కూడా ఉన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు(MLA Candidates List 2023) దాదాపుగా సరిపోలుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో దాదాపుగా ఒకే పేరు ఉన్న అభ్యర్థులు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో నిలిచారు. ఓటర్లను తికమక పెట్టేందుకు ప్రత్యర్థులు సహజంగా ఈ ఎత్తుగడను వినియోగిస్తుంటారు. తాజా ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల ఈ తరహా వ్యూహాన్ని అవలంభించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన వారితో రిజిస్టర్డ్ పార్టీ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేయించారు. అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈ తరహా పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కొందరు అదే నియోజకవర్గాలకు వారు ఈ తరహా నామినేషన్లు దాఖలు చేయగా.. మరికొందరు మాత్రం తమ సొంత జిల్లాలను కాదని వెళ్లి మరీ మరోచోట నామినేషన్లు దాఖలు చేశారు. సిర్పూర్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. డోంగ్రి ప్రవీణ్ కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దిగారు. నిర్మల్​లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఉండగా.. మంతెన ఇంద్రకరణ్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బోధన్​లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి కాంగ్రెస్ అభ్యర్థి కాగా.. సుదర్శన్ రాజ్ ఆకులపల్లి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్​ఎస్​ తరపున ఎన్నికల బరిలో దిగగా.. చంద్రశేఖర్ చలిక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన నివాసం కూకట్ పల్లి, మేడ్చెల్ జిల్లా. కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ బీఆర్​ఎస్​ తరపున పోటీ చేస్తుండగా.. గుర్రం కమలాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

Telangana Elections 2023 : పురుమాల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, నల్లాల శ్రీనివాస్ బీఎస్పీ నుంచి పోటీలో ఉండగా.. బండి శ్రీనివాస్ ఇండియా జనశక్తి పార్టీ, పెంచల శ్రీనివాస్ ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్నారు. సిరిసిల్లలో రెడ్డిమల్ల శ్రీనివాస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా, లగిశెట్టి శ్రీనివాస్ విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి, తాటిపాముల శ్రీనివాస్ - స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మెదక్​లో పద్మా దేవేందర్​ రెడ్డి బీఆర్​ఎస్​(BRS) నుంచి బరిలో ఉండగా.. లంసగల్ల పద్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఎన్నికల వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్

మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా.. వనపర్తి రోహిత్ భారత చైతన్య యువజన పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆందోల్​లో చంటి క్రాంతి కిరణ్​ బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఉండగా.. ఎన్​. క్రాంతి కుమార్​, పి. క్రాంతి కుమార్​ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నర్సాపూర్​లో సునీతా లక్ష్మారెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీలో ఉండగా.. చేకూర్తి లక్ష్మారెడ్డి, పిల్లుట్ల లక్ష్మి, బిడిమట్ట లక్ష్మి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జహీరాబాద్​లో ఎ. చంద్రశేఖర్​ కాంగ్రెస్​ అభ్యర్థి కాగా.. బి. చంద్రకాంత్​ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.

సబితా ఇంద్రారెడ్డి బీఆర్​ఎస్​.. సబితా మద్ది స్వతంత్ర పార్టీ : మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉండగా.. రాజశేఖర్ రెడ్డి వీరయ్యగారి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఉప్పల్​లో బండారి లక్ష్మారెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. లక్ష్మారెడ్డి మన్నె అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనది యాదాద్రి జిల్లా పెద్దగూడెం. ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉండగా అదే పేరు కలిగిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి దేప అనే అభ్యర్థి కూడా స్వతంత్రంగా బరిలో ఉన్నారు. మహేశ్వరంలో పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉండగా.. సబితా మద్ది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందె శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి పోటీలో ఉంటే.. టి.శ్రీరాములు యాదవ్ భారతీయ క్రాంతిసంఘ్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తుండగా.. కె.కిషన్ రెడ్డి అలయెన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజేంద్ర నగర్​లో తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటే.. కొలుకూరి శ్రీనివాస్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

పరిగిలో కె.మహేశ్ రెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. మహేశ్ రెడ్డి బారెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనిది నల్గొండ జిల్లా నిడమనూరు. వికారాబాద్ లో డాక్టర్ ఆనంద్ మెతుకు బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. బి. ఆనంద్ కుమార్-అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిపార్మ్స్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇతనిది రంగారెడ్డి జిల్లా శంషాబాద్. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి - బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీలో ఉండగా.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన పి.రోహిత్ రెడ్డి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. బి.మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా.. డి.మనోహర్ రెడ్డి జన శంఖారావం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కొడంగల్​లో పట్నం నరేందర్ రెడ్డి-బీఆర్​ఎస్​ అభ్యర్ధి కాగా.. నరేందర్ రెడ్డి ప్యాట ఇండిపెండెంట్​గా పోటీలో నిలిచారు. నారాయణపేటలో ఎస్.రాజేందర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉండగా.. కొండాపూర్ రాజేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. మహబూబ్ నగర్ -యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, సి.శ్రీనివాస్ రెడ్డి జన శంఖారావం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్​ఎస్​ అభ్యర్థి కాగా.. ఎం.శ్రీనివాసులు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.

ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్

Telangana Election Polls 2023 : దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉంటే.. ఎం.వెంకటేశ్వర్ రెడ్డి-స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. గవినోళ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, బండ మధుసూదన రెడ్డి-జన శంఖారావం పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. గద్వాలలో సరిత కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండగా.. జి.సరిత నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మరో సరిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసున్నారు. అక్కడ కె.శ్రీనివాసులు పేరిట ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఉండగా.. బాలరాజు గుడ్డటి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తుండగా.. నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన కీసరి హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ చైతన్యపురికి చెందిన ఎ.హర్షవర్ధన్ రావు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి-కాంగ్రెస్ అభ్యర్థిగా, బారెడ్డి లక్ష్మారెడ్డి-స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

బీఆర్​ఎస్​కు స్వతంత్రల గండం : హుజూర్ నగర్​లో సైదిరెడ్డి శానంపూడి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తుండగా.. తిమ్మారెడ్డి సైదిరెడ్డి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి, మారం వెంకట్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉండగా.. కంచర్ల ఆనంద్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్​ఎస్​ తరపున, కట్టా ప్రభాకర్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉన్నారు. అక్కడ. అజయ్ కుమార్ అన్నాబత్తుల, కుక్కల అజయ్ హార్ధిక్ స్వతంత్ర అభ్యర్తులుగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.