కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్ఎస్ఎస్ నేతల ఫోన్ల ట్యాపింగ్పై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్కు చెందిన పెగాసుస్ స్పైవేర్ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు విదేశీ మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తాయన్న వదంతులు వస్తున్నాయని స్వామి పేర్కొన్నారు. అవి నిజమైతే.. ఆ జాబితాను తాను కూడా విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు.
"మోదీ కేబినెట్ మంత్రులు సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ నేతలు, పాత్రికేయుల ఫోన్లను ఇజ్రాయెల్ సంస్థ పెగాసుస్ ట్యాప్ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్, లండన్ గార్డియన్ వార్తా సంస్థలు కథనాన్ని ప్రచురించనునట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను విడుదల చేస్తాను."
- రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
పెగాసుస్ స్పైవేర్ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని తస్కరించారని 2019లో ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ ఆరోపించింది.
ఏమిటీ పెగాసుస్?
ఇజ్రాయెల్లోని ఎన్ఎస్ఓ సంస్థ ప్రతినిధులు పెగాసుస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలకు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఈ స్పైవేర్ను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లలో ప్రవేశపెట్టారని నిఘా వర్గాలు గుర్తించాయి.
ఇదీ చూడండి: 'ప్రజలకు హెచ్చరిక- మంచినీరు కాచి, తాగండి!'