ETV Bharat / bharat

తమిళనాట 'షా' ఇంటింటి ప్రచారం- కేరళలో విజయ యాత్ర

author img

By

Published : Mar 6, 2021, 12:52 PM IST

Updated : Mar 6, 2021, 2:15 PM IST

భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదివారం తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారానికి హాజరుకానున్నారు. ఈ రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న షా.. తమిళనాడులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Shah to launch door-to-door campaign in TN on Sunday
తమిళనాట 'షా' ఇంటింటి ప్రచారం- కేరళలో విజయ యాత్ర

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. భాజపా తరఫున తమిళనాడులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే 'విజయ్ సంకల్ప్ మహా సంపర్క్' పేరిట నిర్వహించే ఎన్నికల ప్రచార యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 10.20కి కన్యాకుమారిలోని సుచీంద్రం ఆలయంలో అమిత్​ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

తమిళనాట షా బిజీబిజీ..

'విజయ్​ సంకల్ప్​ మహాసంపర్క్​'లో భాగంగా భాజపా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. అనంతరం 11.15కి హిందూ కాలేజీ నుంచి కామరాజ్​ విగ్రహం వరకు జరిగే రోడ్​ షోలో పాల్గొంటారు షా. మధ్యాహ్నం 12.30కి ఉడుపి హోటల్‌ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమాల అనంతరం కేరళకు బయలుదేరి వెళతారు అమిత్​ షా. అక్కడ భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే విజయ యాత్రలో షా పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు తిరువనంతపురంలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారని రాష్ట్ర భాజపా విభాగం వెల్లడించింది.

ఇదీ చదవండి: 'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. భాజపా తరఫున తమిళనాడులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే 'విజయ్ సంకల్ప్ మహా సంపర్క్' పేరిట నిర్వహించే ఎన్నికల ప్రచార యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 10.20కి కన్యాకుమారిలోని సుచీంద్రం ఆలయంలో అమిత్​ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

తమిళనాట షా బిజీబిజీ..

'విజయ్​ సంకల్ప్​ మహాసంపర్క్​'లో భాగంగా భాజపా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. అనంతరం 11.15కి హిందూ కాలేజీ నుంచి కామరాజ్​ విగ్రహం వరకు జరిగే రోడ్​ షోలో పాల్గొంటారు షా. మధ్యాహ్నం 12.30కి ఉడుపి హోటల్‌ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమాల అనంతరం కేరళకు బయలుదేరి వెళతారు అమిత్​ షా. అక్కడ భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే విజయ యాత్రలో షా పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు తిరువనంతపురంలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారని రాష్ట్ర భాజపా విభాగం వెల్లడించింది.

ఇదీ చదవండి: 'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'

Last Updated : Mar 6, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.