ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరోసారి టీకా​ డ్రై రన్​

author img

By

Published : Jan 7, 2021, 5:25 AM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం.. చర్యలు వేగవంతం చేసింది కేంద్రం. ఇందుకోసం మరోమారు దేశవ్యాప్తంగా సుమారు 700కుపైగా జిల్లాల్లో టీకా డ్రై రన్​​ చేపట్టనుంది. జనవరి 8న జరిగే ఈ కార్యక్రమం కోసం.. ఆయా రాష్ట్రాల మంత్రులతో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​.

Second mock drill on COVID-19 vaccine administration across India on Jan 8
దేశవ్యాప్తంగా ఈ నెల 8న మరోసారి వ్యాక్సిన్​ డ్రై రన్​!

కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి ముందు మరోసారి దేశవ్యాప్తంగా డ్రై రన్​ నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఉత్తర్​ప్రదేశ్, హరియాణా మినహా.. దేశవ్యాప్తంగా ఈ నెల 8న మలివిడత టీకా డ్రై రన్​ చేపట్టనున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. యూపీలో ఇటీవలే డ్రై రన్​ నిర్వహించగా.. హరియాణాలో జనవరి 7న(గురువారం) జరగనుంది.

కేంద్ర మంత్రి భేటీ..

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో బుధవారం సమావేశమై మార్గనిర్దేశం చేయనున్నారు. కరోనా టీకా వినియోగం దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారు మంత్రి. అంతేకాకుండా దేశంలో బర్డ్​ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దాని నియంత్రణకు ముందస్తు చర్యలపైనా సమీక్ష నిర్వహించనున్నారు.

దేశంలో మొత్తం 700కుపైగా జిల్లాల్లో ఈ నెల 8న డ్రైన్​ రన్​ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే సంబంధిత ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో భాగంగా ప్రతిజిల్లాలో మూడు సెషన్​లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగానే ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు ఇందుకు వేదిక కానున్నాయి. గతవారం(జనవరి 2న) చేపట్టిన తొలిదశ డ్రైరన్​ను మొత్తం 125 జిల్లాల్లో నిర్వహించారు అధికారులు.

6.6 కోట్ల టీకా డోసులు..

దేశంలో తొలి దశ వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా.. ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులకు టీకా అందించేందుకు.. సుమారు 6.6 కోట్లు డోసులు వ్యాక్సిన్​ అవసరమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బఫర్ స్టాక్ సహా మొత్తం 6కోట్ల మందికి టీకా అవసరం కానుంది. ఆక్స్​పర్డ్​-ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్​, భారత్​ బయోటెక్​- కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ల అత్యవసర వినియోగానికి ఇటీవలే ఆమోదం లభించిన నేపథ్యంలో.. టీకా అందించేందుకు ఈ విధమైన సన్నాహాలు చేస్తోంది కేంద్రం. ఈ నెల 13 నుంచి వ్యాక్సిన్​ డ్రై రన్​ చేపట్టనున్నట్టు ప్రకటించింది ఆరోగ్యశాఖ.

ఇదీ చదవండి: ఈవీఎంల రద్దు పిటిషన్​ తిరస్కరణ

కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి ముందు మరోసారి దేశవ్యాప్తంగా డ్రై రన్​ నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఉత్తర్​ప్రదేశ్, హరియాణా మినహా.. దేశవ్యాప్తంగా ఈ నెల 8న మలివిడత టీకా డ్రై రన్​ చేపట్టనున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. యూపీలో ఇటీవలే డ్రై రన్​ నిర్వహించగా.. హరియాణాలో జనవరి 7న(గురువారం) జరగనుంది.

కేంద్ర మంత్రి భేటీ..

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో బుధవారం సమావేశమై మార్గనిర్దేశం చేయనున్నారు. కరోనా టీకా వినియోగం దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారు మంత్రి. అంతేకాకుండా దేశంలో బర్డ్​ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దాని నియంత్రణకు ముందస్తు చర్యలపైనా సమీక్ష నిర్వహించనున్నారు.

దేశంలో మొత్తం 700కుపైగా జిల్లాల్లో ఈ నెల 8న డ్రైన్​ రన్​ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే సంబంధిత ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో భాగంగా ప్రతిజిల్లాలో మూడు సెషన్​లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగానే ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు ఇందుకు వేదిక కానున్నాయి. గతవారం(జనవరి 2న) చేపట్టిన తొలిదశ డ్రైరన్​ను మొత్తం 125 జిల్లాల్లో నిర్వహించారు అధికారులు.

6.6 కోట్ల టీకా డోసులు..

దేశంలో తొలి దశ వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా.. ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులకు టీకా అందించేందుకు.. సుమారు 6.6 కోట్లు డోసులు వ్యాక్సిన్​ అవసరమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బఫర్ స్టాక్ సహా మొత్తం 6కోట్ల మందికి టీకా అవసరం కానుంది. ఆక్స్​పర్డ్​-ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్​, భారత్​ బయోటెక్​- కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ల అత్యవసర వినియోగానికి ఇటీవలే ఆమోదం లభించిన నేపథ్యంలో.. టీకా అందించేందుకు ఈ విధమైన సన్నాహాలు చేస్తోంది కేంద్రం. ఈ నెల 13 నుంచి వ్యాక్సిన్​ డ్రై రన్​ చేపట్టనున్నట్టు ప్రకటించింది ఆరోగ్యశాఖ.

ఇదీ చదవండి: ఈవీఎంల రద్దు పిటిషన్​ తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.