ETV Bharat / international

మిలిటరీ హెలికాప్టర్​ను ఢీకొట్టిన ప్యాసింజర్ విమానం- అనేక మంది మృతి! - US AIRCRAFT HELICOPTER COLLISION

హెలికాప్టర్​ను ఢీకొట్టిన ప్యాసింజర్ విమానం- అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలోని ఎయిర్​పోర్టులో జరిగిన ప్రమాదం- అనేక మంది మృతి

US Aircraft Helicopter Collision
US Aircraft Helicopter Collision (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 8:58 AM IST

Updated : Jan 30, 2025, 11:45 AM IST

US Aircraft Helicopter Collision : అమెరికా రాజధాని వాషింగ్టన్‌ సమీపంలోని రొనాల్డ్​ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్​ విమానం, మిలిటరీ హెలికాప్టర్​ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కానీ మృతుల సంఖ్యపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు.

కాన్సాస్​లోని విచిటా నుంచి బయలుదేరిన పీఎస్​ఏ ఏయిర్​లైన్స్​కు చెందిన బాంబార్డియర్​ CJR700 విమానం, ల్యాండింగ్​ అవుతుండగా సికోర్స్కీ H-60 హెలికాప్టర్​ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పొటోమాక్​ నదిలో పడిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్​పోర్టేషన్ సేఫ్టీ బోర్డు-ఎన్​టీఎస్​ నేతృత్వంలో ఎఫ్​ఏఏ దర్యాప్తు చేస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నదిలో విమానం కూలిపోగా, ఫైర్​ బోట్లు రంగంలో దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించినదిగా పేర్కొన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వారు క్షేమంగా ఉండాలి : ట్రంప్
ఈ ఘోర ప్రమాదం గురించి తనకు సమాచారం అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. త్వరగా స్పందించినందుకు ఫస్ట్ రెస్పాండర్స్​కు అభినందనలు తెలిపారు. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. విమానంలో ఉన్న వారు క్షేమంగా (మె గాడ్​ బ్లెస్​ దేర్ సోల్స్) ఉండాలని కోరుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​, ప్రమాదానికి గురైన విమానంలో ఉన్నవారి గురించి ప్రార్థన చేయాలని కోరారు. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నాము తెలిపారు. కానీ ప్రస్తుతానికి మనం మంచి జరగాలని ఆశిద్దామని అన్నారు.
అందుబాటులో ఉన్న అన్ని కోస్ట్ గార్డ్ వనరులను మోహరిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ చెప్పారు.

US Aircraft Helicopter Collision : అమెరికా రాజధాని వాషింగ్టన్‌ సమీపంలోని రొనాల్డ్​ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్​ విమానం, మిలిటరీ హెలికాప్టర్​ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కానీ మృతుల సంఖ్యపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు.

కాన్సాస్​లోని విచిటా నుంచి బయలుదేరిన పీఎస్​ఏ ఏయిర్​లైన్స్​కు చెందిన బాంబార్డియర్​ CJR700 విమానం, ల్యాండింగ్​ అవుతుండగా సికోర్స్కీ H-60 హెలికాప్టర్​ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పొటోమాక్​ నదిలో పడిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్​పోర్టేషన్ సేఫ్టీ బోర్డు-ఎన్​టీఎస్​ నేతృత్వంలో ఎఫ్​ఏఏ దర్యాప్తు చేస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నదిలో విమానం కూలిపోగా, ఫైర్​ బోట్లు రంగంలో దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించినదిగా పేర్కొన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వారు క్షేమంగా ఉండాలి : ట్రంప్
ఈ ఘోర ప్రమాదం గురించి తనకు సమాచారం అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. త్వరగా స్పందించినందుకు ఫస్ట్ రెస్పాండర్స్​కు అభినందనలు తెలిపారు. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. విమానంలో ఉన్న వారు క్షేమంగా (మె గాడ్​ బ్లెస్​ దేర్ సోల్స్) ఉండాలని కోరుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​, ప్రమాదానికి గురైన విమానంలో ఉన్నవారి గురించి ప్రార్థన చేయాలని కోరారు. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నాము తెలిపారు. కానీ ప్రస్తుతానికి మనం మంచి జరగాలని ఆశిద్దామని అన్నారు.
అందుబాటులో ఉన్న అన్ని కోస్ట్ గార్డ్ వనరులను మోహరిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ చెప్పారు.

Last Updated : Jan 30, 2025, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.