బిహార్, ఝార్ఖండ్లో కార్యకలాపాలు సాగించే ప్రముఖ రోడ్డు కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థపై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల నల్లధనం బయటపడింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అక్టోబరు 27న బిహార్, ఝార్ఖండ్, బంగాల్, మహారాష్ట్రలోని కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు సీబీడీటీ పేర్కొంది.
ఇదీ చూడండి: కొమ్ములతో కుమ్మేసిన ఎద్దు- వృద్ధురాలు మృతి