ETV Bharat / bharat

వెంకయ్య అధ్యక్షతన అఖిలపక్ష భేటీ - Rajya Sabha Chairman Venkaiah Naidu news

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. బడ్జెట్ సమావేశాలు, సభా కార్యకలాపాలపై నేతలు చర్చించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చించాలని భేటీలో నిర్ణయించారు.

Rajya Sabha Chairman M Venkaiah Naidu holds a meeting with floor leaders of the House
వెంకయ్య అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
author img

By

Published : Jan 31, 2021, 1:44 PM IST

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేసం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలు, సభా కార్యకలాపాలపై అన్ని పార్టీల నాయకులు చర్చించారు. సమావేశాలు ప్రారంభమయ్యాక తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చించాలని భేటీలో నిర్ణయించారు.

అంతకుముందు సమావేశమైన రాజ్యసభ బీఏసీ.. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 10గంటలు, బడ్జెట్ పై చర్చకు 10గంటల సమయాన్ని కేటాయించింది. 267 నిబంధన కింద రైతుల అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించింది.

ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 5న రాజ్యసభలో ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్​

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేసం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలు, సభా కార్యకలాపాలపై అన్ని పార్టీల నాయకులు చర్చించారు. సమావేశాలు ప్రారంభమయ్యాక తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చించాలని భేటీలో నిర్ణయించారు.

అంతకుముందు సమావేశమైన రాజ్యసభ బీఏసీ.. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 10గంటలు, బడ్జెట్ పై చర్చకు 10గంటల సమయాన్ని కేటాయించింది. 267 నిబంధన కింద రైతుల అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించింది.

ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 5న రాజ్యసభలో ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.