ETV Bharat / bharat

విద్యుత్​ తీగ తెగిపడి బైక్​పై వెళ్తున్న ఇద్దరు సజీవదహనం - రాజస్థాన్ ఇద్దరు వాహనదారులు సజీవదహనం

రాజస్థాన్​లోని మౌంట్​అబు ప్రాంతంలో ఇద్దరు వాహనదారులు సజీవ దహనమయ్యారు. బైక్​పై వెళ్తుండగా విద్యుత్​ తీగ తెగిపడగా.. మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు.

Two burnt alive and died in Sirohi
విద్యుత్​ లైన్​ తెగిపడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం
author img

By

Published : Oct 6, 2021, 1:02 PM IST

విద్యుత్​ తీగ తెగిపడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిరోహి జిల్లాలోని మౌంట్​అబు ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

wo burnt alive and died in Sirohi
విద్యుత్​ తీగ తెగపడి చెలరేగిన మంటలు​

తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగ అకస్మాత్తుగా తెగి.. వారిపై పడింది. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు కింద పడిపోగా.. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని వారిద్దరు సజీవ దహనమయ్యారు.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతులను రాజసమంద్‌ జిల్లాకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్​మాస్టర్​ లైంగిక వేధింపులు!

విద్యుత్​ తీగ తెగిపడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిరోహి జిల్లాలోని మౌంట్​అబు ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

wo burnt alive and died in Sirohi
విద్యుత్​ తీగ తెగపడి చెలరేగిన మంటలు​

తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగ అకస్మాత్తుగా తెగి.. వారిపై పడింది. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు కింద పడిపోగా.. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని వారిద్దరు సజీవ దహనమయ్యారు.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతులను రాజసమంద్‌ జిల్లాకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్​మాస్టర్​ లైంగిక వేధింపులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.