ETV Bharat / bharat

'పెట్రో బాదుడుతో పేదలకు భారం.. కేంద్రానికి రూ.10వేల కోట్ల లాభం!'

author img

By

Published : Mar 22, 2022, 4:46 PM IST

Fuel Price Hike: గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలకు ఇంధనాన్ని భారంగా మార్చి ఆ సొమ్ముతో కేంద్రం లాభపడుతోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇంధన ధరలపై కేంద్రం విధించిన లాక్​డౌన్​ ముగిసిందన్నారు రాహుల్ గాంధీ. మరోవైపు వంట గ్యాస్​ ధర పెంపు ప్రజలకు కేంద్రం ఇచ్చిన కానుక అని ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ఎద్దేవా చేశారు.

Fuel Price Hike
వంట గ్యాస్

Fuel Price Hike: సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. వంట గ్యాస్​ ధరను కూడా రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్​, పెట్రోల్, డీజిల్​ ధరలపై కేంద్రం విధించిన లాక్​డౌన్​ ముగిసిందన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.

"దేశంలో గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ ధరలపై కేంద్రం విధించిన లాక్​డౌన్​ ముగిసింది. ఇకపై కేంద్రం తరచూ వీటి ధరలను పెంచుతూ ఉంటుంది. ఈ విషయపై ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తే చప్పట్లు కొట్టండి అంటారు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

"ఇంధన ధరలను పేదలకు భారంగా మార్చిన కేంద్రం.. రూ.10వేల కోట్లు లాభపడింది. చాలా మంది ఉక్రెయిన్​-రష్యా యుద్ధం కారణంగా ధరలు పెరిగాయని అంటున్నారు. కానీ పెట్రోలియం శాఖ మంత్రి మాత్రం అసలు ముడి చమురును భారత్​ రష్యా నుంచి కొనుగోలు చేయదని చెప్తున్నారు."

-మల్లికార్జున ఖర్గే, లోక్​సభలో ప్రతిపక్ష నేత

"అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని మేము ఇదివరకే చెప్పాము. మా అంచనా నిజమైంది. కాంగ్రెస్​ సామాన్యుడికి అండగా నిలుస్తుంది" అని మరో కాంగ్రెస్​ సీనియర్ నేత అధిర్​రంజన్​ చౌదరి పేర్కొన్నారు.

"ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన సందర్భంగా ప్రజలకు ఇది కేంద్రం ఇచ్చిన మరో ద్రవ్యోల్బణం కానుక. లఖ్​నవూలో ఎల్​పీజీ సిలిండర్​ దాదాపు రూ.1000 ఉంది. పట్నాలో రూ.వెయ్యిపైనే ఉంది. ఎన్నికలు ముగిశాయి, ద్రవ్యోల్బణం మొదలైంది."

-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత

"భాజపాను గెలిపిస్తే ఇదే పరిస్థితి నెలకొంటుందని అఖిలేశ్​ ఎన్నికల ప్రచారంలోనే ప్రజలను హెచ్చరించారు. భాజపా అధికారంలో ఉంటే ఇది చేస్తుంది."

-జయా బచ్చన్​, ఎస్​పీ ఎంపీ

రెండుసార్లు వాయిదా..

ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల నిరసనల మధ్య రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది.

రికార్డ్​ మిస్​..

2019లో నిర్విరామంగా సభలు జరిగినట్టు రాజ్యసభకు రికార్డు ఉంది. 13 రోజుల పాటు ఎలాంటి వాయిదాలు లేకుండా సభలు జరిగాయి. ఈసారి కూడా 12 రోజుల పాటు నిర్విరామంగా సభలు సాగిన నేపథ్యంలో రికార్డు బ్రేక్​ అయ్యే అవకాశం వచ్చినా.. మంగళవారం సభ వాయిదాతో ఆ రికార్డ్​ మిస్​ అయింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఐదు నెలల పాటు ధరలను కేంద్రం కట్టడి చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే తాజాగా గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​పై భారీగా ధరలను పెంచేందుకు చమురు సంస్థలకు అనుమతించింది. దీంతో పెట్రోల్​, డీజిల్​ లీటరుకు 80 పైసలు, 14 కిలోల గ్యాస్​ సిలిండర్​పై రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో సిలిండర్​ ధర రూ.949.50, పెట్రోల్​ రూ. 96.21, డీజిల్​ రూ.87.47గా ఉంది.

ఇదీ చూడండి : జయలలిత మృతిపై విచారణ.. కమిషన్ ఎదుట హాజరైన ఓపీఎస్​

Fuel Price Hike: సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. వంట గ్యాస్​ ధరను కూడా రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్​, పెట్రోల్, డీజిల్​ ధరలపై కేంద్రం విధించిన లాక్​డౌన్​ ముగిసిందన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.

"దేశంలో గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ ధరలపై కేంద్రం విధించిన లాక్​డౌన్​ ముగిసింది. ఇకపై కేంద్రం తరచూ వీటి ధరలను పెంచుతూ ఉంటుంది. ఈ విషయపై ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తే చప్పట్లు కొట్టండి అంటారు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

"ఇంధన ధరలను పేదలకు భారంగా మార్చిన కేంద్రం.. రూ.10వేల కోట్లు లాభపడింది. చాలా మంది ఉక్రెయిన్​-రష్యా యుద్ధం కారణంగా ధరలు పెరిగాయని అంటున్నారు. కానీ పెట్రోలియం శాఖ మంత్రి మాత్రం అసలు ముడి చమురును భారత్​ రష్యా నుంచి కొనుగోలు చేయదని చెప్తున్నారు."

-మల్లికార్జున ఖర్గే, లోక్​సభలో ప్రతిపక్ష నేత

"అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని మేము ఇదివరకే చెప్పాము. మా అంచనా నిజమైంది. కాంగ్రెస్​ సామాన్యుడికి అండగా నిలుస్తుంది" అని మరో కాంగ్రెస్​ సీనియర్ నేత అధిర్​రంజన్​ చౌదరి పేర్కొన్నారు.

"ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన సందర్భంగా ప్రజలకు ఇది కేంద్రం ఇచ్చిన మరో ద్రవ్యోల్బణం కానుక. లఖ్​నవూలో ఎల్​పీజీ సిలిండర్​ దాదాపు రూ.1000 ఉంది. పట్నాలో రూ.వెయ్యిపైనే ఉంది. ఎన్నికలు ముగిశాయి, ద్రవ్యోల్బణం మొదలైంది."

-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత

"భాజపాను గెలిపిస్తే ఇదే పరిస్థితి నెలకొంటుందని అఖిలేశ్​ ఎన్నికల ప్రచారంలోనే ప్రజలను హెచ్చరించారు. భాజపా అధికారంలో ఉంటే ఇది చేస్తుంది."

-జయా బచ్చన్​, ఎస్​పీ ఎంపీ

రెండుసార్లు వాయిదా..

ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల నిరసనల మధ్య రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది.

రికార్డ్​ మిస్​..

2019లో నిర్విరామంగా సభలు జరిగినట్టు రాజ్యసభకు రికార్డు ఉంది. 13 రోజుల పాటు ఎలాంటి వాయిదాలు లేకుండా సభలు జరిగాయి. ఈసారి కూడా 12 రోజుల పాటు నిర్విరామంగా సభలు సాగిన నేపథ్యంలో రికార్డు బ్రేక్​ అయ్యే అవకాశం వచ్చినా.. మంగళవారం సభ వాయిదాతో ఆ రికార్డ్​ మిస్​ అయింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఐదు నెలల పాటు ధరలను కేంద్రం కట్టడి చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే తాజాగా గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​పై భారీగా ధరలను పెంచేందుకు చమురు సంస్థలకు అనుమతించింది. దీంతో పెట్రోల్​, డీజిల్​ లీటరుకు 80 పైసలు, 14 కిలోల గ్యాస్​ సిలిండర్​పై రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో సిలిండర్​ ధర రూ.949.50, పెట్రోల్​ రూ. 96.21, డీజిల్​ రూ.87.47గా ఉంది.

ఇదీ చూడండి : జయలలిత మృతిపై విచారణ.. కమిషన్ ఎదుట హాజరైన ఓపీఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.