ETV Bharat / bharat

నేడు దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం

నేటి నుంచి దేశవ్యాప్తంగా పల్స్​ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఒక్కరోజు ముందే శనివారం.. పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఓ చిన్నారికి ఆయనే పోలియో చుక్కలు వేశారు.

author img

By

Published : Jan 31, 2021, 5:36 AM IST

pulse polio programme STARTED ON SUNDAY
నేడు పోలియో టీకాల పంపిణీ

దేశవ్యాప్తంగా పోలియో టీకాల పంపిణీ ఆదివారం నుంచి జరగనుంది. అయిదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఫిబ్రవరి 2 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. శనివారమే పల్స్​ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ చిన్నారికి స్వయంగా చుక్కలు వేశారు.

17 కోట్ల మందికిపైగా..

కరోనా నిబంధనలను అనుసరించి.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకాల పంపిణీ జరగనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.

టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభం కావాల్సి ఉన్నా అదే రోజు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఆరంభం కావడంతో ఈ కార్యక్రమ తేదీని సవరించారు.

ఇదీ చూడండి: పోలియో చుక్కల పంపిణీని ప్రారంభించిన రాష్ట్రపతి

దేశవ్యాప్తంగా పోలియో టీకాల పంపిణీ ఆదివారం నుంచి జరగనుంది. అయిదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఫిబ్రవరి 2 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. శనివారమే పల్స్​ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ చిన్నారికి స్వయంగా చుక్కలు వేశారు.

17 కోట్ల మందికిపైగా..

కరోనా నిబంధనలను అనుసరించి.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకాల పంపిణీ జరగనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.

టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభం కావాల్సి ఉన్నా అదే రోజు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఆరంభం కావడంతో ఈ కార్యక్రమ తేదీని సవరించారు.

ఇదీ చూడండి: పోలియో చుక్కల పంపిణీని ప్రారంభించిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.