ETV Bharat / bharat

అటల్​ జీ సేవలు స్ఫూర్తిదాయకం: మోదీ

author img

By

Published : Dec 25, 2021, 10:08 AM IST

Modi tribute to Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన స్మారకం 'సదైవ్​ అటల్​' వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సహా కేంద్ర మంత్రులు, ప్రముఖులు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

Modi tribute to Atal Bihari Vajpayee
వాజ్​పేయీకు మోదీ సహా ప్రముఖుల నివాళి

Modi tribute to Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాజ్​పేయీ అభివృద్ధి కార్యక్రమాలు లక్షలాది మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయన్నారు. దిల్లీలోని అటల్​ స్మారకం 'సదైవ్​ అటల్​' వద్ద పుష్పాంజలి ఘటించారు.

Modi tribute to Atal Bihari Vajpayee
సదైవ్​ అటల్​ స్మారకం వద్ద మోదీ నివాళులు

" అటల్​ జీ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. దేశానికి ఆయన చేసిన సేవ స్ఫూర్తిదాయకం. దేశాన్ని పటిష్ఠంగా, అభివృద్ధిమయంగా మార్చేందుకు ఆయన జీవితాన్నే అంకితం చేశారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మిలియన్ల మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

స్వతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్​ మదన్​ మోహన్​ మాలవియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు మోదీ. గొప్ప సామాజిక సంస్కర్తగా కొనియాడారు.

Modi tribute to Atal Bihari Vajpayee
సదైవ్​ అటల్​ స్మారకం

రాష్ట్రపతి సహా ప్రముఖుల నివాళి..

మాజీ ప్రధాని వాజ్​పేయీ జయంతి సందర్భంగా దిల్లీలోని సదైవ్​ అటల్​ స్మారకం వద్ద నివాళులర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Modi tribute to Atal Bihari Vajpayee
వాజ్​పేయీకి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Modi tribute to Atal Bihari Vajpayee
వాజ్​పేయీకి నివాళులర్పిస్తున్న ఓం బిర్లా, కేంద్ర మంత్రులు

సుపరిపాలన దినోత్సవంగా..

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు. వాజ్​పేయీ నేతృత్వంలోని నేషనల్​ డెమోక్రాటిక్​ అలియన్స్​(ఎన్​డీఏ) ప్రభుత్వం 1998-2004 వరకు అధికారంలో ఉంది. భాజపా నుంచి ప్రధాని అయిన తొలి నేతగా గుర్తింపు పొందారు వాజ్​పేయీ. ఆయన మూడు సార్లు ప్రధానిగా సేవలందించారు. 1996లో ప్రధాని అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ 1998,1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ 2018, ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: నిజాం చెప్పులకు మాలవీయ వేలం...

Modi tribute to Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాజ్​పేయీ అభివృద్ధి కార్యక్రమాలు లక్షలాది మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయన్నారు. దిల్లీలోని అటల్​ స్మారకం 'సదైవ్​ అటల్​' వద్ద పుష్పాంజలి ఘటించారు.

Modi tribute to Atal Bihari Vajpayee
సదైవ్​ అటల్​ స్మారకం వద్ద మోదీ నివాళులు

" అటల్​ జీ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. దేశానికి ఆయన చేసిన సేవ స్ఫూర్తిదాయకం. దేశాన్ని పటిష్ఠంగా, అభివృద్ధిమయంగా మార్చేందుకు ఆయన జీవితాన్నే అంకితం చేశారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మిలియన్ల మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

స్వతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్​ మదన్​ మోహన్​ మాలవియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు మోదీ. గొప్ప సామాజిక సంస్కర్తగా కొనియాడారు.

Modi tribute to Atal Bihari Vajpayee
సదైవ్​ అటల్​ స్మారకం

రాష్ట్రపతి సహా ప్రముఖుల నివాళి..

మాజీ ప్రధాని వాజ్​పేయీ జయంతి సందర్భంగా దిల్లీలోని సదైవ్​ అటల్​ స్మారకం వద్ద నివాళులర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Modi tribute to Atal Bihari Vajpayee
వాజ్​పేయీకి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Modi tribute to Atal Bihari Vajpayee
వాజ్​పేయీకి నివాళులర్పిస్తున్న ఓం బిర్లా, కేంద్ర మంత్రులు

సుపరిపాలన దినోత్సవంగా..

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు. వాజ్​పేయీ నేతృత్వంలోని నేషనల్​ డెమోక్రాటిక్​ అలియన్స్​(ఎన్​డీఏ) ప్రభుత్వం 1998-2004 వరకు అధికారంలో ఉంది. భాజపా నుంచి ప్రధాని అయిన తొలి నేతగా గుర్తింపు పొందారు వాజ్​పేయీ. ఆయన మూడు సార్లు ప్రధానిగా సేవలందించారు. 1996లో ప్రధాని అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ 1998,1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ 2018, ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: నిజాం చెప్పులకు మాలవీయ వేలం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.