ETV Bharat / bharat

అంబులెన్స్​లో మంటలు- గర్భిణీ సజీవదహనం

గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఓ విషాద ఘటన జరిగింది. అంబులెన్స్​ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో అంబులెన్స్​లో మంటలు చెలరేగి మహిళ సజీవదహనమయ్యారు. ఈ ఘటన యూపీలో జరిగింది.

author img

By

Published : May 2, 2021, 10:39 AM IST

ambulance caught fire
అంబులెన్స్​లో మంటలు, గర్భిణి మృతి

అంబులెన్స్ ప్రమాదానికి గురికాగా... ఓ గర్భిణీ సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు.. మహ్ముదాబాద్-గొడచ్చ ప్రాంతం నుంచి వెళ్తున్న క్రమంలో అంబులెన్స్​ అదుపు తప్పింది. చెట్టును ఢీకొట్టిన ఆ అంబులెన్స్​ నుంచి మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న గర్భిణీ మృతిచెందగా.. ఇద్దరు అంబులెన్స్​ సిబ్బంది, డ్రైవర్​ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ambulance caught in fire
అదుపు తప్పిన అంబులెన్స్

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. గర్భిణీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?'

అంబులెన్స్ ప్రమాదానికి గురికాగా... ఓ గర్భిణీ సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు.. మహ్ముదాబాద్-గొడచ్చ ప్రాంతం నుంచి వెళ్తున్న క్రమంలో అంబులెన్స్​ అదుపు తప్పింది. చెట్టును ఢీకొట్టిన ఆ అంబులెన్స్​ నుంచి మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న గర్భిణీ మృతిచెందగా.. ఇద్దరు అంబులెన్స్​ సిబ్బంది, డ్రైవర్​ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ambulance caught in fire
అదుపు తప్పిన అంబులెన్స్

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. గర్భిణీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.