దేశంలో అర్హులైన ఏ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ అనే సురక్షా వలయం బయట ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మన్ కీ బాత్ (mann ki baat today )ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. రాబోయేది పండగల కాలం అయినందున ఆ సమయంలో ప్రజలంతా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.
ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. వీటిని కాలుష్య రహితంగా మార్చేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశప్రజలు ఏటా ఒక్కసారైనా 'నదీ ఉత్సవాలు' జరుపుకోవాలని సూచించారు. ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవం(Rivers day 2021) సందర్భంగా.. మనసులో మాట(మన్ కీ బాత్) కార్యక్రమం వేదికగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.