ETV Bharat / bharat

రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

author img

By

Published : Apr 13, 2021, 10:21 AM IST

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ. అందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

president ram nath kovind greets on ugadhi
రామ్​నాథ్​ కొవింద్​ ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను' అని రాష్ట్రపతి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

    — President of India (@rashtrapatibhvn) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్విట్టర్‌ ద్వారా తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్​ తెలుగులో చేయడం విశేషం. 'అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.

    — Narendra Modi (@narendramodi) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.

— Narendra Modi (@narendramodi) April 13, 2021

సంతోషాల నావలో ప్రయాణం సాగాలి:

తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ వసంతం ప్రజలందరి జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని, సంతోషాల నావలో ప్రయాణం సాగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

  • తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
    ఈ వసంతం మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే సంతోషాల నావలో ప్రయాణంలా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.#Ugadi2021 pic.twitter.com/NmWIJQybdo

    — Vice President of India (@VPSecretariat) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 15 నుంచి అమర్​నాథ్​ యాత్రకు పేర్ల నమోదు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను' అని రాష్ట్రపతి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

    — President of India (@rashtrapatibhvn) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్విట్టర్‌ ద్వారా తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్​ తెలుగులో చేయడం విశేషం. 'అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.

    — Narendra Modi (@narendramodi) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంతోషాల నావలో ప్రయాణం సాగాలి:

తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ వసంతం ప్రజలందరి జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని, సంతోషాల నావలో ప్రయాణం సాగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

  • తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
    ఈ వసంతం మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే సంతోషాల నావలో ప్రయాణంలా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.#Ugadi2021 pic.twitter.com/NmWIJQybdo

    — Vice President of India (@VPSecretariat) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 15 నుంచి అమర్​నాథ్​ యాత్రకు పేర్ల నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.