ETV Bharat / bharat

విదేశీ అధికారులతో మోదీ భేటీలు రద్దు!

author img

By

Published : Apr 15, 2021, 5:28 PM IST

Updated : Apr 15, 2021, 5:58 PM IST

దేశంలో కరోనా విజృంభణ కారణంగా ప్రధాని మోదీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ముందుగా కుదిరిన షెడ్యూల్​లను నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వైరస్​పై ప్రధాని నిరంతరం సమీక్షలు జరుపుతున్న వేళ కొద్ది రోజుల తర్వాతే వారితో సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.

PM Modi, foreign dignitaries
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశీ ఉన్నతాధికారులు

భారత్​లో కరోనా ఉద్ధృతి.. విదేశీ ప్రతినిధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముందస్తుగా ఖరారైన భేటీలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ డ్రియన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్​లు మోదీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ భేటీలు జరగలేదు.

దేశంలో వైరస్​ పరిస్థితిపై మోదీ వరుస సమీక్షలు జరుపుతున్నందున.. ఆయనతో విదేశీ ఉన్నతాధికారుల సమావేశాలను కొద్ది రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మహమ్మారిపై ఇటీవల అన్ని రాష్ట్రాల గవర్నర్లతో భేటీ అయిన ప్రధాని... సీబీఎస్​ఈ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

బోరిస్ పర్యటన కుదింపు..

దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ పర్యటనను కుదించారు. ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం జాన్సన్​.. చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దిల్లీలో మోదీ సహా బడా వ్యాపారవేత్తలతోనే సమావేశమవుతారని సమాచారం.

ఇదీ చూడండి: 'కరోనాను జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

భారత్​లో కరోనా ఉద్ధృతి.. విదేశీ ప్రతినిధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముందస్తుగా ఖరారైన భేటీలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ డ్రియన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్​లు మోదీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ భేటీలు జరగలేదు.

దేశంలో వైరస్​ పరిస్థితిపై మోదీ వరుస సమీక్షలు జరుపుతున్నందున.. ఆయనతో విదేశీ ఉన్నతాధికారుల సమావేశాలను కొద్ది రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మహమ్మారిపై ఇటీవల అన్ని రాష్ట్రాల గవర్నర్లతో భేటీ అయిన ప్రధాని... సీబీఎస్​ఈ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

బోరిస్ పర్యటన కుదింపు..

దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ పర్యటనను కుదించారు. ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం జాన్సన్​.. చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దిల్లీలో మోదీ సహా బడా వ్యాపారవేత్తలతోనే సమావేశమవుతారని సమాచారం.

ఇదీ చూడండి: 'కరోనాను జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

Last Updated : Apr 15, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.