ETV Bharat / bharat

మోదీతో విజయన్​ భేటీ.. కేరళ ఎంపీలతో పోలీసుల ఘర్షణ!

author img

By

Published : Mar 24, 2022, 3:10 PM IST

Pinarayi Vijayan meets Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. కేరళ రైల్​ ప్రాజెక్ట్​ సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇదే క్రమంలో రైల్వే ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ యూడీఎఫ్​ ఎంపీలు పార్లమెంట్​ వద్ద నిరసనకు దిగారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు, ఎంపీల మధ్య ఘర్షణ తలెత్తింది.

pinarayi vijayan meets modi
ప్రధాని మోదీ, పినరయి విజయన్​

Pinarayi Vijayan meets Modi: దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. మోదీతో పలు విషయాలపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ట్వీట్​ చేసింది. మోదీతో విజయన్​ సమావేశమైన చిత్రాలను పోస్ట్​ చేసింది. సిల్వర్​లైన్​(కే-రైల్​ ప్రాజెక్ట్​) సహా పలు కీలక అంశాలపై మోదీతో విజయన్​ చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం చూస్తున్నారు విజయన్. కొచి-బెంగళూరు ఇండస్ట్రీయల్​ కారిడార్​ కోసం భూసేకరణ వేగవంతంగా సాగుతున్నట్లు కేరళ సీఎం ప్రకటించిన మరుసటి రోజునే ఈ భేటీ జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, సిల్వర్​లైన్​ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలువురు ఆందోళన చేస్తున్న క్రమంలో భేటీ కీలకంగా మారింది.

pinarayi vijayan meets modi
మోదీతో కేరళ సీఎం

పోలీసులు, ఎంపీల మధ్య ఘర్షణ: కే-సిల్వర్​ లైన్​ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దిల్లీలోని విజయ్​ చౌక్ నుంచి పార్లమెంట్​ వరకు​ యూడీఎఫ్​ ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. స్వల్ప ఘర్షణ తలెత్తింది. పోలీసులు తమను అడ్డుకోవటమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారని ఓ కాంగ్రెస్​ ఎంపీ ఆరోపించారు. దీనిపై దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. 'అక్కడ ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వారి గురించి ఏమీ చెప్పకుండా నినాదాలు చేస్తూ పార్లమెంట్​ వైపు దూసుకెళ్తుండగా బారికేడ్ల వద్దే ఉండి సిబ్బంది అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు అడగగా చూపించేందుకు నిరాకరించారు. కొద్దిసేపటికి గేట్​-1 వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారు ఎంపీలను దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారిని నిరసన తెలిపేందుకు అనుమతించాం.' అని వివరించారు.

  • #WATCH | Delhi: A scuffle breaks out between police forces & Kerala's UDF MPs while they were protesting at Vijay Chowk against Kerala's K-Silver line project pic.twitter.com/V1Ll3HlqJJ

    — ANI (@ANI) March 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీతో భగవంత్​ మాన్​ భేటీ: పంజాబ్​ నూతన ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​.. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై మోదీతో చర్చించినట్లు అధికావర్గాలు తెలిపాయి. అనంతరం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్​ ఆద్మీ జాతీయ కార్యదర్శి అరవింద్​ కేజ్రీవాల్​తో సమావేశం కానున్నారని పేర్కొన్నాయి.

Pinarayi Vijayan meets Modi: దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. మోదీతో పలు విషయాలపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ట్వీట్​ చేసింది. మోదీతో విజయన్​ సమావేశమైన చిత్రాలను పోస్ట్​ చేసింది. సిల్వర్​లైన్​(కే-రైల్​ ప్రాజెక్ట్​) సహా పలు కీలక అంశాలపై మోదీతో విజయన్​ చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం చూస్తున్నారు విజయన్. కొచి-బెంగళూరు ఇండస్ట్రీయల్​ కారిడార్​ కోసం భూసేకరణ వేగవంతంగా సాగుతున్నట్లు కేరళ సీఎం ప్రకటించిన మరుసటి రోజునే ఈ భేటీ జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, సిల్వర్​లైన్​ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలువురు ఆందోళన చేస్తున్న క్రమంలో భేటీ కీలకంగా మారింది.

pinarayi vijayan meets modi
మోదీతో కేరళ సీఎం

పోలీసులు, ఎంపీల మధ్య ఘర్షణ: కే-సిల్వర్​ లైన్​ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దిల్లీలోని విజయ్​ చౌక్ నుంచి పార్లమెంట్​ వరకు​ యూడీఎఫ్​ ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. స్వల్ప ఘర్షణ తలెత్తింది. పోలీసులు తమను అడ్డుకోవటమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారని ఓ కాంగ్రెస్​ ఎంపీ ఆరోపించారు. దీనిపై దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. 'అక్కడ ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వారి గురించి ఏమీ చెప్పకుండా నినాదాలు చేస్తూ పార్లమెంట్​ వైపు దూసుకెళ్తుండగా బారికేడ్ల వద్దే ఉండి సిబ్బంది అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు అడగగా చూపించేందుకు నిరాకరించారు. కొద్దిసేపటికి గేట్​-1 వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారు ఎంపీలను దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారిని నిరసన తెలిపేందుకు అనుమతించాం.' అని వివరించారు.

  • #WATCH | Delhi: A scuffle breaks out between police forces & Kerala's UDF MPs while they were protesting at Vijay Chowk against Kerala's K-Silver line project pic.twitter.com/V1Ll3HlqJJ

    — ANI (@ANI) March 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీతో భగవంత్​ మాన్​ భేటీ: పంజాబ్​ నూతన ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​.. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై మోదీతో చర్చించినట్లు అధికావర్గాలు తెలిపాయి. అనంతరం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్​ ఆద్మీ జాతీయ కార్యదర్శి అరవింద్​ కేజ్రీవాల్​తో సమావేశం కానున్నారని పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.