ETV Bharat / bharat

ఎంపీల సస్పెన్షన్​పై విపక్షాల వాకౌట్​.. రాజ్యసభ వాయిదా

author img

By

Published : Dec 13, 2021, 11:42 AM IST

Updated : Dec 13, 2021, 1:46 PM IST

parliament winter session live updates
విపక్షాల వాకౌట్​.. రాజ్యసభ వాయిదా

13:44 December 13

లోక్​సభ నుంచి కాంగ్రెస్​ వాకౌట్​

సీబీఎస్​ఈ వ్యవహారాన్ని లోక్​సభలో ప్రస్తావించిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. అయితే ఆమె ప్రసంగానికి స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్​, పలు ఇతర పార్టీలు దిగువ సభ నుంచి వాకౌట్​ చేశాయి.

12:21 December 13

సోనియా గాంధీ డిమాండ్​

సీబీఎస్​ఈ తాజాగా నిర్వహించిన పదో తరగతి ఇంగ్లీష్​ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ వ్యాసం వివాదానికి దారితీసింది. మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఆ వ్యాసం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని లోక్​సభ వేదికగా ప్రస్తావించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రజలకు సీబీఎస్​ఈ వెంటనే క్షమాపణలు చేయాలని డిమాండ్​ చేశారు.

12:07 December 13

మళ్లీ వాయిదా..

విపక్షాల నిరసనలతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 12మంది సభ్యుల సస్పెన్షన్​ను రద్దుచేయాలంటూ విపక్ష సభ్యులు చేసిన వాకౌట్​తో తొలుత రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనా.. పెద్దగా తేడా లేకుండా పోయింది. చివరికి 2గంటల వరకు మళ్లీ వాయిదా పడింది.

11:32 December 13

విపక్షాల వాకౌట్​.. రాజ్యసభ వాయిదా

రెండు రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. 12మంది ఎంపీల సస్పెన్షన్​ను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. ప్రభుత్వ వైఖరి వల్లే తాము ఆందోళనలు చేస్తున్నట్టు, ఇప్పడు కూడా సభ నుంచి వాకౌట్​ చేస్తామని కాంగ్రెస్​ ఎంపీ మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల వాకౌట్​ చేసిన కొద్దిసేపటికి.. రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.

అటు లోక్​సభలో ప్రశాంతంగా చర్చలు జరుగుతున్నాయి.

అంతకుముందు.. భారత పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడికి 20 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పార్లమెంట్​ ఆవరణలో అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.

13:44 December 13

లోక్​సభ నుంచి కాంగ్రెస్​ వాకౌట్​

సీబీఎస్​ఈ వ్యవహారాన్ని లోక్​సభలో ప్రస్తావించిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. అయితే ఆమె ప్రసంగానికి స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్​, పలు ఇతర పార్టీలు దిగువ సభ నుంచి వాకౌట్​ చేశాయి.

12:21 December 13

సోనియా గాంధీ డిమాండ్​

సీబీఎస్​ఈ తాజాగా నిర్వహించిన పదో తరగతి ఇంగ్లీష్​ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ వ్యాసం వివాదానికి దారితీసింది. మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఆ వ్యాసం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని లోక్​సభ వేదికగా ప్రస్తావించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రజలకు సీబీఎస్​ఈ వెంటనే క్షమాపణలు చేయాలని డిమాండ్​ చేశారు.

12:07 December 13

మళ్లీ వాయిదా..

విపక్షాల నిరసనలతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 12మంది సభ్యుల సస్పెన్షన్​ను రద్దుచేయాలంటూ విపక్ష సభ్యులు చేసిన వాకౌట్​తో తొలుత రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనా.. పెద్దగా తేడా లేకుండా పోయింది. చివరికి 2గంటల వరకు మళ్లీ వాయిదా పడింది.

11:32 December 13

విపక్షాల వాకౌట్​.. రాజ్యసభ వాయిదా

రెండు రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. 12మంది ఎంపీల సస్పెన్షన్​ను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. ప్రభుత్వ వైఖరి వల్లే తాము ఆందోళనలు చేస్తున్నట్టు, ఇప్పడు కూడా సభ నుంచి వాకౌట్​ చేస్తామని కాంగ్రెస్​ ఎంపీ మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల వాకౌట్​ చేసిన కొద్దిసేపటికి.. రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.

అటు లోక్​సభలో ప్రశాంతంగా చర్చలు జరుగుతున్నాయి.

అంతకుముందు.. భారత పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడికి 20 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పార్లమెంట్​ ఆవరణలో అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.

Last Updated : Dec 13, 2021, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.