ETV Bharat / bharat

సరిహద్దుల్లో డ్రోన్​ కలకలం- పాకిస్థాన్​ పనే!

author img

By

Published : Dec 6, 2021, 1:46 PM IST

India Pakistan border drone: పాకిస్థాన్​ సరిహద్దుల్లో ఓ డ్రోన్​ కలకలం సృష్టించింది. పంజాబ్​ అమృత్​సర్​లో భద్రతాదళాలు ఆ డ్రోన్​ గుర్తించి కాల్పులు జరిపాయి. ఆ వెంటనే ఆ డ్రోన్​ పాకిస్థాన్​వైపు తిరిగి వెళ్లిపోయింది.

India Pakistan border drone
సరిహద్దుల్లో డ్రోన్​ కలకలం- పాకిస్థాన్​ పనే!

Pakistan drone India: పంజాబ్​లోని ఇండో-పాక్​ సరిహద్దు వద్ద మరోమారు డ్రోన్​ కలకలం సృష్టించింది. అమృత్​సర్​లోని అజ్నాలాలో ఆదివారం రాత్రి ఓ డ్రోన్​ను బీఓపీ ఓల్డ్​ సుందర్​గఢ్​కి చెందిన 183 బీఎస్​ఎఫ్​ బెటాలియన్​ గుర్తించింది. వెంటనే గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో ఆ డ్రోన్​ పాకిస్థాన్​వైపు తిరిగి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.

డ్రోన్లు ఇలా దర్శనమివ్వడం.. వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత నెల 30న.. అదే ప్రాంతంలో డ్రోన్​ దర్శనమిచ్చింది. ఆ ప్రాంతంలో నాలుగు ప్యాకెట్ల హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Pakistan drone India: పంజాబ్​లోని ఇండో-పాక్​ సరిహద్దు వద్ద మరోమారు డ్రోన్​ కలకలం సృష్టించింది. అమృత్​సర్​లోని అజ్నాలాలో ఆదివారం రాత్రి ఓ డ్రోన్​ను బీఓపీ ఓల్డ్​ సుందర్​గఢ్​కి చెందిన 183 బీఎస్​ఎఫ్​ బెటాలియన్​ గుర్తించింది. వెంటనే గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో ఆ డ్రోన్​ పాకిస్థాన్​వైపు తిరిగి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.

డ్రోన్లు ఇలా దర్శనమివ్వడం.. వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత నెల 30న.. అదే ప్రాంతంలో డ్రోన్​ దర్శనమిచ్చింది. ఆ ప్రాంతంలో నాలుగు ప్యాకెట్ల హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:- సరిహద్దులో పాక్ డ్రోన్ సంచారం- బీఎస్ఎఫ్ కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.