ETV Bharat / bharat

మరోసారి పాక్​ వక్రబుద్ధి- రెచ్చిపోయిన ఉగ్రవాదులు

author img

By

Published : Dec 31, 2020, 8:24 PM IST

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్​ ఉల్లంఘించి.. మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మరోవైపు జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ముష్కరుల కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఘటనలో ఓ సీఆర్​ఫీఎఫ్ జవాన్ కూడా గాయపడ్డాడు.

Pak troops violate ceasefire along LoC, target mosques and houses in Kupwara
మరోసారి పాక్​ వక్రబుద్ధి- రెచ్చిపోయిన ఉగ్రవాదులు

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి తాంగ్​ధర్ సెక్టార్​ వద్ద ​మసీదులు, ఇళ్లే లక్ష్యంగా మోటార్​ షెల్స్​తో దాడులకు పాల్పడ్డాయి పాక్​ బలగాలు. రాజౌరి జిల్లాలోనూ నౌషెరా సెక్టార్​ వద్ద పాక్​ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత్​ సైన్యం తెలిపింది.

ఉగ్రవాదుల దాడిలో వ్యక్తి మృతి

శ్రీనగర్​లోని సారై ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్లో ఓ వండ్రంగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే అతన్ని ముష్కరులు ఎందుకు చంపారనేది తెలియలేదు.

జవాన్​కు గాయాలు

అనంతనాగ్​ జిల్లాలో భద్రత సిబ్బందే లక్ష్యంగా ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్​పీఎఫ్​ జవాన్​ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'దిల్లీ సరిహద్దుల్లోనే రైతుల నూతన సంవత్సర వేడుకలు'

కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి తాంగ్​ధర్ సెక్టార్​ వద్ద ​మసీదులు, ఇళ్లే లక్ష్యంగా మోటార్​ షెల్స్​తో దాడులకు పాల్పడ్డాయి పాక్​ బలగాలు. రాజౌరి జిల్లాలోనూ నౌషెరా సెక్టార్​ వద్ద పాక్​ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత్​ సైన్యం తెలిపింది.

ఉగ్రవాదుల దాడిలో వ్యక్తి మృతి

శ్రీనగర్​లోని సారై ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్లో ఓ వండ్రంగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే అతన్ని ముష్కరులు ఎందుకు చంపారనేది తెలియలేదు.

జవాన్​కు గాయాలు

అనంతనాగ్​ జిల్లాలో భద్రత సిబ్బందే లక్ష్యంగా ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్​పీఎఫ్​ జవాన్​ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'దిల్లీ సరిహద్దుల్లోనే రైతుల నూతన సంవత్సర వేడుకలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.