ETV Bharat / bharat

రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత​

author img

By

Published : Mar 28, 2021, 10:17 AM IST

అసోంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్​ బయటపడ్డాయి. సుమారు రూ.12 కోట్లు విలువ చేసే మెథాంఫేటామిన్​ టాబ్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగా పీపుల్స్​ ఫ్రంట్​ కార్యకర్తల నుంచి అధికారులు అక్రమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

One held, drugs worth Rs 12 cr seized in Mizoram
రూ.12.09 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

అసోంలో భారీ డ్రగ్​ రాకెట్​ బయటపడింది. మిజోరం పోలీసులు, అసోం రైఫిల్స్​ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో ఓ వ్యక్తి నుంచి రూ.12 కోట్లు విలువ చేసే 2,41,900 మెథాంఫేటామిన్ టాబ్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు.

కోలాసిబ్​ జిల్లాలోని కాన్​పుయి వెంగ్​తార్​ ప్రాంతంలో నిందితుడిని ఈ నెల 26న పోలీసులు అరెస్టు చేశారు.

"మార్చి 26న అసోం రైఫిల్స్, మిజోరాం పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్​లో రూ.12.09 కోట్ల విలువైన 2,41,900 మెథాంఫేటామిన్ మాత్రలను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నాం. కోలాసిబ్​ జిల్లాలోని కాన్​పుయి ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్​ చేశాం."

-అసోం రైఫిల్స్​ ట్వీట్​

మారణాయుధాలు స్వాధీనం..

నాగా పీపుల్స్​ ఫ్రంట్​ కార్యకర్తల నుంచి అధికారులు అక్రమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో అసోం రైఫిల్స్​, నాగాలాండ్​ పోలీసులు సంయుక్తంగా జున్‌హెబోటో ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి. ముగ్గురు ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 32 ఎంఎం పిస్టల్స్, బులెట్లు, దోషపూరిత పత్రాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​ ఫజ్జా హతం

అసోంలో భారీ డ్రగ్​ రాకెట్​ బయటపడింది. మిజోరం పోలీసులు, అసోం రైఫిల్స్​ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో ఓ వ్యక్తి నుంచి రూ.12 కోట్లు విలువ చేసే 2,41,900 మెథాంఫేటామిన్ టాబ్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు.

కోలాసిబ్​ జిల్లాలోని కాన్​పుయి వెంగ్​తార్​ ప్రాంతంలో నిందితుడిని ఈ నెల 26న పోలీసులు అరెస్టు చేశారు.

"మార్చి 26న అసోం రైఫిల్స్, మిజోరాం పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్​లో రూ.12.09 కోట్ల విలువైన 2,41,900 మెథాంఫేటామిన్ మాత్రలను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నాం. కోలాసిబ్​ జిల్లాలోని కాన్​పుయి ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్​ చేశాం."

-అసోం రైఫిల్స్​ ట్వీట్​

మారణాయుధాలు స్వాధీనం..

నాగా పీపుల్స్​ ఫ్రంట్​ కార్యకర్తల నుంచి అధికారులు అక్రమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో అసోం రైఫిల్స్​, నాగాలాండ్​ పోలీసులు సంయుక్తంగా జున్‌హెబోటో ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి. ముగ్గురు ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 32 ఎంఎం పిస్టల్స్, బులెట్లు, దోషపూరిత పత్రాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​ ఫజ్జా హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.