ETV Bharat / bharat

సాయంత్రం 5 గంటల నుంచి బీచ్​లు, పార్కుల్లోకి నో ఎంట్రీ!

author img

By

Published : Dec 31, 2021, 3:17 PM IST

Updated : Dec 31, 2021, 3:45 PM IST

Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదలతో ముంబయిలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్​లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. జనవరి 15 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి.

night curfew in mumbai
ముంబయిలో రాత్రి కర్ఫ్యూ

Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో ముంబయిలో రాత్రి వేళల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్​లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని నిబంధనలు..

  • వివాహ కార్యక్రమాల్లో 50 మందికి మించరాదు.
  • సామాజిక, మతపరమైన, రాజకీయ సభల్లో కూడా 50 మంది కంటే ఎక్కువ హాజరుకావద్దు.
  • అంతిమ సంస్కారాల్లో 20 మందికన్నా ఎక్కువ పాల్గొనకూడదు.
  • ఈ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు.

Mumbai Curfew Rules: ముంబయిలో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగాయి. దానికి తోడు ఒమిక్రాన్​ వేరియంట్​ కూడా ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. గురువారం 46,337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,555 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కరోనా కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. ఏ కార్యక్రమాల్లోనైనా 50 మందికి మించరాదని ఆంక్షలు విధించింది. ఇంతకుముందు ఇండోర్​లో 100 మంది.. బహిరంగ ప్రదేశాల్లో 250 మంది హాజరు కావొచ్చనే నిబంధనలు ఉండేవి.

ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 16వేల మందికి వైరస్​

ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో ముంబయిలో రాత్రి వేళల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్​లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని నిబంధనలు..

  • వివాహ కార్యక్రమాల్లో 50 మందికి మించరాదు.
  • సామాజిక, మతపరమైన, రాజకీయ సభల్లో కూడా 50 మంది కంటే ఎక్కువ హాజరుకావద్దు.
  • అంతిమ సంస్కారాల్లో 20 మందికన్నా ఎక్కువ పాల్గొనకూడదు.
  • ఈ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు.

Mumbai Curfew Rules: ముంబయిలో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగాయి. దానికి తోడు ఒమిక్రాన్​ వేరియంట్​ కూడా ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. గురువారం 46,337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,555 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కరోనా కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. ఏ కార్యక్రమాల్లోనైనా 50 మందికి మించరాదని ఆంక్షలు విధించింది. ఇంతకుముందు ఇండోర్​లో 100 మంది.. బహిరంగ ప్రదేశాల్లో 250 మంది హాజరు కావొచ్చనే నిబంధనలు ఉండేవి.

ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 16వేల మందికి వైరస్​

ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

Last Updated : Dec 31, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.