ETV Bharat / bharat

చైనాకు రాజ్​నాథ్​ పరోక్ష సందేశం

author img

By

Published : Dec 10, 2020, 12:10 PM IST

భారత్​ రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఆసియాన్​ రక్షణమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. వర్చువల్​గా జరిగిన ఈ భేటీలో చైనాపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. స్వీయ నిగ్రహంతో మెలిగి, పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చే చర్యలను నివారించినప్పుడే శాంతిని కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

need-to-avoid-actions-that-may-complicate-situation-rajnath-singh
'పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చొద్దు'

స్వీయ నిగ్రహం పాటించడం, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని.. చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. 7 నెలలుగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజ్​నాథ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వర్చువల్​గా జరిగిన ఆసియాన్​ ఏడీఎమ్​ఎమ్​-ప్లస్​(రక్షణమంత్రుల సమావేశం)లో పాల్గొన్నారు రాజ్​నాథ్​. పరస్పర సహకారంతో మెలిగే పరిస్థితులను కల్పించడంలో ఆసియాన్​ దేశాల పాత్రను కొనియాడారు.

"పరస్పర నమ్మకాన్ని వృద్ధి చేందుతున్న క్రమంలో స్వీయ నిగ్రహంతో ఉండి, పరిస్థితులను మరింత క్లిష్టంగా చేసుకోవడాన్ని మానుకుంటే ప్రాంతాంలో శాంతిని కొనసాగించవచ్చు. అయితే సైబర్​ నేరాలు, ఉగ్రవాదం, సముద్ర భద్రతతో పాటు మరికొన్ని సమస్యలు.. శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. ఆసియాన్​ బృందంగా మనం ఈ సమస్యలను పరిష్కరించాలి."

-- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

ఈ సమావేశానికి హాజరైన వారిలో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘి కూడా ఉన్నారు. మొత్తం మీద 10 ఆసియాన్​ దేశాలతో పాటు ఏడీఎమ్​ఎమ్​-ప్లస్​లో ఆస్ట్రేలియా, చైనా, భారత్​, జపాన్​, న్యూజిలాండ్​, రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా, రష్యా, అమెరికా కూడా ఉన్నాయి.

ఇదీ చూడండి:- ఏటీఎం దొంగతో సెక్యూరిటీ గార్డ్​ పోరు

స్వీయ నిగ్రహం పాటించడం, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని.. చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. 7 నెలలుగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజ్​నాథ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వర్చువల్​గా జరిగిన ఆసియాన్​ ఏడీఎమ్​ఎమ్​-ప్లస్​(రక్షణమంత్రుల సమావేశం)లో పాల్గొన్నారు రాజ్​నాథ్​. పరస్పర సహకారంతో మెలిగే పరిస్థితులను కల్పించడంలో ఆసియాన్​ దేశాల పాత్రను కొనియాడారు.

"పరస్పర నమ్మకాన్ని వృద్ధి చేందుతున్న క్రమంలో స్వీయ నిగ్రహంతో ఉండి, పరిస్థితులను మరింత క్లిష్టంగా చేసుకోవడాన్ని మానుకుంటే ప్రాంతాంలో శాంతిని కొనసాగించవచ్చు. అయితే సైబర్​ నేరాలు, ఉగ్రవాదం, సముద్ర భద్రతతో పాటు మరికొన్ని సమస్యలు.. శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. ఆసియాన్​ బృందంగా మనం ఈ సమస్యలను పరిష్కరించాలి."

-- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

ఈ సమావేశానికి హాజరైన వారిలో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘి కూడా ఉన్నారు. మొత్తం మీద 10 ఆసియాన్​ దేశాలతో పాటు ఏడీఎమ్​ఎమ్​-ప్లస్​లో ఆస్ట్రేలియా, చైనా, భారత్​, జపాన్​, న్యూజిలాండ్​, రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా, రష్యా, అమెరికా కూడా ఉన్నాయి.

ఇదీ చూడండి:- ఏటీఎం దొంగతో సెక్యూరిటీ గార్డ్​ పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.