ETV Bharat / bharat

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్​సీపీ కీలక నిర్ణయం

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార ఎల్​డీఎఫ్​ను వీడి యూడీఎఫ్​లో చేరింది ఎన్​సీపీ. తనకు ఏడుగురు జిల్లా అధ్యక్షుల మద్దతు ఉందని ఎన్​సీపీకి నేతృత్వం వహిస్తున్న మణి సీ కప్పెన్​ తెలిపారు.

author img

By

Published : Feb 13, 2021, 1:56 PM IST

NCP faction quits LDF coalition, to join UDF
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్​సీపీ కీలక నిర్ణయం

కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఎన్​సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఐ(ఎం​) నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​ను వీడి.. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​లో చేరనున్నట్టు ప్రకటించింది.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రమేశ్​ చెన్నితల.. ఐశ్వర్య కేరళ పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర.. తన నియోజకవర్గమైన పాలాకు చేరినప్పుడు ఇందులో పాల్గొంటానని.. రాష్ట్రంలో ఎన్​సీపీకి నేతృత్వం వహిస్తున్న ఎమ్మెల్యే మణి సీ కప్పెన్ వెల్లడించారు.

ఎల్​డీఎఫ్​ టికెట్​ మీద 2019 ఉప ఎన్నికల్లో గెలిచిన కప్పెన్​.. తనకు 7 జిల్లాల ఎన్​సీపీ అధ్యక్షులు, 9 రాష్ట్రస్థాయి ఆఫీస్​ బేరర్ల మద్దతు ఉందని ప్రకటించారు.

కప్పెన్​ నిర్ణయానికి ఓ కారణమున్నట్టు తెలుస్తోంది. జాస్​ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్​(ఎమ్​).. యూడీఎఫ్​తో ఉన్న 10ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎల్​డీఎఫ్​తో చేతులు కలిపింది. అనంతరం. పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి అందించే యోచనలో అధికార సీపీఐ(ఎమ్​) ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్​డీఎఫ్​ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఎన్​సీపీ నేత.

ఈ వ్యవహారంపై కేరళ రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్​ స్పందించారు. ఉపఎన్నికల్లో తనను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:- కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే!

కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఎన్​సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఐ(ఎం​) నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​ను వీడి.. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​లో చేరనున్నట్టు ప్రకటించింది.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రమేశ్​ చెన్నితల.. ఐశ్వర్య కేరళ పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర.. తన నియోజకవర్గమైన పాలాకు చేరినప్పుడు ఇందులో పాల్గొంటానని.. రాష్ట్రంలో ఎన్​సీపీకి నేతృత్వం వహిస్తున్న ఎమ్మెల్యే మణి సీ కప్పెన్ వెల్లడించారు.

ఎల్​డీఎఫ్​ టికెట్​ మీద 2019 ఉప ఎన్నికల్లో గెలిచిన కప్పెన్​.. తనకు 7 జిల్లాల ఎన్​సీపీ అధ్యక్షులు, 9 రాష్ట్రస్థాయి ఆఫీస్​ బేరర్ల మద్దతు ఉందని ప్రకటించారు.

కప్పెన్​ నిర్ణయానికి ఓ కారణమున్నట్టు తెలుస్తోంది. జాస్​ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్​(ఎమ్​).. యూడీఎఫ్​తో ఉన్న 10ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎల్​డీఎఫ్​తో చేతులు కలిపింది. అనంతరం. పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి అందించే యోచనలో అధికార సీపీఐ(ఎమ్​) ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్​డీఎఫ్​ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఎన్​సీపీ నేత.

ఈ వ్యవహారంపై కేరళ రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్​ స్పందించారు. ఉపఎన్నికల్లో తనను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:- కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.