ETV Bharat / bharat

Nanded Hospital Death News : నాందేడ్‌ ప్రభుత్వాస్పత్రిలో మరో ఏడుగురు మృతి.. 31కి చేరిన మరణాలు.. విపక్షాలు ఫైర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 12:28 PM IST

Updated : Oct 3, 2023, 2:17 PM IST

Nanded Hospital Death News : మహారాష్ట్ర-నాందేడ్‌లోని శంకర్‌రావు చావన్‌ ప్రభుత్వాస్పత్రిలో వరుస మరణాలు ఆగడం లేదు. సోమవారం 24గంటల్లో 24మరణాలు సంభవించాగా.. తాజాగా మరో ఏడుగురు మృతి చెందారు. దీంత ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది.

More 7th Patients Died In Nanded Govt Hospital Death Toll Rises On 31st Patients On Two Day
More 7th Patients Died In Nanded Govt Hospital Death Toll Rises On 31st Patients On Two Day

Nanded Hospital Death News : మహారాష్ట్ర-నాందేడ్‌లోని శంకర్‌రావు చావన్‌ ప్రభుత్వాస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది. గత 24గంటల్లో 24మరణాలతో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ ఆస్పత్రిలో తాజాగా మరో ఏడుగురు మృతి చెందారు. 48 గంటల్లో చనిపోయినవారి సంఖ్య 31కి పెరిగింది. వారిలో 16మంది నవజాత శిశువులు/ చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, 76 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల్లో కొందరు పాము కాటుకు గురైనవారు కాగా మరికొందరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారున్నారని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.

'చివరి దశలో రోగులు వచ్చారు'
అయితే, ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలను ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావు తోసిపుచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ రోగులు స్పందించటం లేదన్నారు. చాలా మంది రోగులు చివరి దశలో ఆసుపత్రికి వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేషెంట్స్​ వచ్చారని చెప్పారు. రోగులను రక్షించడానికి ఆస్పత్రి వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారని డీన్​ వివరించారు.

ఘటనపై విచారణకు కమిటీ
నాందేడ్‌ మరణాలపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంబంధిత ఆస్పత్రిని సందర్శించి పూర్తి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే సర్కార్‌పై విపక్షాలు ఎదురుదాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డాయి.

ఒక్కరోజులో 14 మంది మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఘాటీ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. గత 24 గంటల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఆస్పత్రిలో మందుల కొరత వల్లే రోగులు మరణించారన్న ఆరోపణలను జిల్లా ఆస్పత్రి యాజమాన్యం​ ఖండించింది. ఈ వరుస ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్షనేత అంబాదాస్​ దాన్వే డిమాండ్​ చేశారు.

"గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రికి కావాల్సిన మందులు సకాలంలో అందడం లేదు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలు బలవుతున్నారు. మందుల కొరత కారణంగా ఆస్పత్రి వర్గాలు రోగి బంధువులను మందుల కోసం ప్రైవేటు మెడికల్​ షాపులకు పంపుతున్నాయి. బయట వేల రూపాయలు పెట్టి మందులు కొనలేక కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి."

Friends Win Lottery In Punjab : స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర జాక్​పాట్

Stones On Vande Bharat Railway Track : పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లు.. వందేభారత్​కు తప్పిన భారీ ప్రమాదం

Nanded Hospital Death News : మహారాష్ట్ర-నాందేడ్‌లోని శంకర్‌రావు చావన్‌ ప్రభుత్వాస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది. గత 24గంటల్లో 24మరణాలతో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ ఆస్పత్రిలో తాజాగా మరో ఏడుగురు మృతి చెందారు. 48 గంటల్లో చనిపోయినవారి సంఖ్య 31కి పెరిగింది. వారిలో 16మంది నవజాత శిశువులు/ చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, 76 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల్లో కొందరు పాము కాటుకు గురైనవారు కాగా మరికొందరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారున్నారని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.

'చివరి దశలో రోగులు వచ్చారు'
అయితే, ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలను ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావు తోసిపుచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ రోగులు స్పందించటం లేదన్నారు. చాలా మంది రోగులు చివరి దశలో ఆసుపత్రికి వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేషెంట్స్​ వచ్చారని చెప్పారు. రోగులను రక్షించడానికి ఆస్పత్రి వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారని డీన్​ వివరించారు.

ఘటనపై విచారణకు కమిటీ
నాందేడ్‌ మరణాలపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంబంధిత ఆస్పత్రిని సందర్శించి పూర్తి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే సర్కార్‌పై విపక్షాలు ఎదురుదాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డాయి.

ఒక్కరోజులో 14 మంది మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఘాటీ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. గత 24 గంటల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఆస్పత్రిలో మందుల కొరత వల్లే రోగులు మరణించారన్న ఆరోపణలను జిల్లా ఆస్పత్రి యాజమాన్యం​ ఖండించింది. ఈ వరుస ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్షనేత అంబాదాస్​ దాన్వే డిమాండ్​ చేశారు.

"గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రికి కావాల్సిన మందులు సకాలంలో అందడం లేదు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలు బలవుతున్నారు. మందుల కొరత కారణంగా ఆస్పత్రి వర్గాలు రోగి బంధువులను మందుల కోసం ప్రైవేటు మెడికల్​ షాపులకు పంపుతున్నాయి. బయట వేల రూపాయలు పెట్టి మందులు కొనలేక కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి."

Friends Win Lottery In Punjab : స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర జాక్​పాట్

Stones On Vande Bharat Railway Track : పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లు.. వందేభారత్​కు తప్పిన భారీ ప్రమాదం

Last Updated : Oct 3, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.