ETV Bharat / bharat

ఫుడ్​ సరిగా వండలేదని వదినను కాల్చి చంపిన మరిది

author img

By

Published : Dec 20, 2021, 6:41 AM IST

Man shoots sister in law: ఫుడ్​ సరిగా వండలేదని ఓ వ్యక్తి తన వదినను కాల్చి చంపాడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ దేవాస్​ హత్పిపాల్యాలో జరిగింది.

Man shoots himself dead after killing sister-in-law
వదినను కాల్చి చంపిన మరిది

Man shoots sister in law: మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. తినే అన్నం సరిగా వండలేదని వదినను కాల్చి చంపాడు ఓ మరిది. అనంతరం తానూ తుపాకీ కాల్చుకున్నాడు. ఈ ఘటన దేవాస్ హాత్పిపాల్యాలో జరిగింది.

జిల్లా కేంద్రానికి 45 కిమీ దూరంలో ఉన్న హాత్పిపాల్యాలో రీనా మాల్వియా ఓ ఆసుపత్రిని నడుపుతుంది. ఆదివారం అయినా అన్న సరిగా వండలేనది ఆమెను తన వద్ద ఉన్న తుపాకీతో విజయ్​ మాల్వియా కాల్చి చంపినట్లు ఎస్​పీ సుర్యకాంత్​ శర్మ తెలిపారు. ఆపై తాను కూడా పక్కన ఉన్న పెరటిలో అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు.

ఇంతలో వచ్చిన ఆసుపత్రి సిబ్బంది వారిని పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలం నుంచి తుపాకీ, మోటార్​ సైకిల్​ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఈ ఘటనపై రీనా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న సరిగా వండని కారణంగా వీరి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. దీంతో కాల్పులు జరినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 'సీఎం నా ఫోన్​ ట్యాప్ చేసి వింటున్నారు!'

Man shoots sister in law: మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. తినే అన్నం సరిగా వండలేదని వదినను కాల్చి చంపాడు ఓ మరిది. అనంతరం తానూ తుపాకీ కాల్చుకున్నాడు. ఈ ఘటన దేవాస్ హాత్పిపాల్యాలో జరిగింది.

జిల్లా కేంద్రానికి 45 కిమీ దూరంలో ఉన్న హాత్పిపాల్యాలో రీనా మాల్వియా ఓ ఆసుపత్రిని నడుపుతుంది. ఆదివారం అయినా అన్న సరిగా వండలేనది ఆమెను తన వద్ద ఉన్న తుపాకీతో విజయ్​ మాల్వియా కాల్చి చంపినట్లు ఎస్​పీ సుర్యకాంత్​ శర్మ తెలిపారు. ఆపై తాను కూడా పక్కన ఉన్న పెరటిలో అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు.

ఇంతలో వచ్చిన ఆసుపత్రి సిబ్బంది వారిని పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలం నుంచి తుపాకీ, మోటార్​ సైకిల్​ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఈ ఘటనపై రీనా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న సరిగా వండని కారణంగా వీరి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. దీంతో కాల్పులు జరినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 'సీఎం నా ఫోన్​ ట్యాప్ చేసి వింటున్నారు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.