మధ్యప్రదేశ్లో గ్వాలియర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది మహిళలు. ఓల్డ్ చావ్నీ ప్రాంతంలో బస్సు-ఆటో ఢీకొనడం వల్ల ఇంతటి విషాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు.. అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేసే మహిళలు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సింగ్ వెల్లడించారు.
ప్రమాదంలో 8 మంది మహిళలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా వారు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.